Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ హాస్టల్‌లో 18 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. అనుమానితుడు రైలు ట్రాక్ పై పడి ఆత్మహత్య...

ముంబైలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థిని మీద అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. అనుమానితుడు ఆ తరువాత దగ్గర్లోని ట్రాక్ పై శవంగా కనిపించాడు. 

girl student raped, murdered at government hostelsuspect guard kills self on tracks  in Mumbai -bsb
Author
First Published Jun 7, 2023, 10:51 AM IST

ముంబై : అకోలాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని మంగళవారం రాత్రి దక్షిణ ముంబైలోని తన హాస్టల్ గదిలో హత్యకు గురైంది. ఆమె మీద లైంగిక వేధింపులు జరిగినట్లు తెలుస్తోంది. బాలికలప్రభుత్వ హాస్టల్‌ నాలుగో అంతస్తులో ఉన్న తన గదిలో లైంగిక వేధింపులకు గురై, గొంతు కోసి హత్య చేయబడింది.

అనుమానితుడు, లాండ్రీ మ్యాన్‌గా, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ప్రకాష్ కనోజియా. అయితే, ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై అతని మృతదేహం లభ్యమైంది.

నాలుగో అంతస్తులో ఒక్కతే ఉన్న బాలిక మంగళవారం తెల్లవారుజామున హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కనోజియా (35) తెల్లవారుజామున 4.55 గంటలకు మెయిన్ గేట్ సెక్యూరిటీ క్యాబిన్ దగ్గర బట్టల మూటను వదిలి బయటకు వెళుతుండగా హాస్టల్ సీసీటీవీ కెమెరాలో చిక్కాడు. హాస్టల్ కు నీటి సౌకర్యాల ఇన్‌ఛార్జ్‌గా కూడా అతను ఉండటంతో టెర్రస్ తాళాలు కూడా అతని వద్ద ఉన్నాయి.

బాలికకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ అధికారులు మంగళవారం సాయంత్రం వెతకగా నేరం వెలుగులోకి వచ్చింది. వారు కిటికీలోంచి గదిలోకి చూడగా, రెండు మంచాల మధ్య నేలపై ఆమె శరీరం నగ్నంగా పడి ఉంది. గది బయటి నుంచి తాళం వేసి ఉంది. అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. చర్చలకు పిలిచిన కేంద్రం.. అనురాగ్ ఠాకూర్ ట్వీట్..

బాలిక, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం రాత్రి 11.30 గంటలకు హాస్టల్ మేట్ ఆమెతో చివరిసారిగా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక నాల్గవ అంతస్తులో ఒంటరిగా ఉన్నందున తన రూంకు రమ్మని హాస్టల్ మేట్ కోరింది. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. తన గదిలో ఒంటరిగా ఉండటమే ఇష్టం అని చెప్పింది. 

ఆమె ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ అధికారులు మంగళవారం సాయంత్రం బాలిక కోసం వెతికారు. ఆమె బయటకు వెళ్లేందుకు ప్రధాన ద్వారం వద్ద చెక్ అవుట్ బుక్ లో సంతకం లేదు. కానీ, ఆమె గది బయటి నుండి తాళం వేసి ఉండడాన్ని వారు గుర్తించారు. కిటికీలోంచి గదిలోకి చూసేసరికి ఆమె శవం కనిపించింది. హాస్టల్ అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

కలీనా ల్యాబ్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం తాళం పగలగొట్టి, గదిని తెరిచి, నేరస్థలం నుండి వేలిముద్రలతో సహా ఆధారాలను సేకరించింది. బాలికను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం దగ్గర దుపట్టా కనిపించింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాత్రి 8.15 గంటలకు జేజే ఆస్పత్రికి తరలించారు.

అనుమానితుడు కనోజీ తండ్రి కూడా అంతకు ముందు హాస్టల్ లో పనిచేశాడు. ఇప్పుడు కొలాబాలో పనిచేస్తున్నారు. కనోజీ తమ్ముడు కూడా ఇదే హాస్టల్ లో పనిచేస్తున్నాడు. కానీ అతను నెల రోజులుగా లాంగ్ లీవ్ లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios