PUNE: హెచ్ఎస్సీ పరీక్షలో ఫెయిల్ కావడంతో పన్నెండో తరగతి విద్యార్థిని గురువారం తన ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భోసరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల యువతి దపోడిలోని ఓ కళాశాలలో కామర్స్ చదువుతోంది. 

Girl commits suicide after failing HSC exam: హెచ్ఎస్సీ పరీక్షలో ఫెయిల్ కావడంతో పన్నెండో తరగతి విద్యార్థిని మనస్తాపంతో గురువారం తన ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భోసరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల యువతి దపోడిలోని ఓ కళాశాలలో కామర్స్ చదువుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఆమె హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్సీ) బోర్డు పరీక్షల్లో ఫెయిలయ్యానని తల్లిదండ్రులకు తెలిపిందనీ, దీని ఫలితాలు గురువారం విడుదలయ్యాయని ఓ అధికారి తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆమె తండ్రి ఆమెను ఈ విష‌యంలో ఓదార్చ‌డానికి ప్రయత్నించారనీ, ఆమె మళ్లీ పరీక్షకు హాజరుకావచ్చని చెప్పారని అధికారి తెలిపారు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన యువతి మొదటి అంతస్తులోని తన గదికి వెళ్లింది. 15 నిమిషాల తర్వాత బాలిక పైకప్పుకు దుపట్టాతో ఉరివేసుకుని ఉండటాన్ని ఆమె తల్లి గుర్తించిందనీ, ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరో షాకింగ్ ఘటన

తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా త‌న నాలుగేళ్ల కొడుకు ఆ ఘ‌ట‌న‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. బాధితురాలి సోదరి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఈ ఆత్మ‌హ‌త్య‌ వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. డిప్రెష‌న్ తో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ను అత‌ని చిన్న కొడుకు మొబైల్ ఫోన్‌లో వీడియో చిత్రించాడు. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా, బాధితురాలి సోదరి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం వెలుగులోకి వచ్చింది.