నాగాలాండ్లోని దిమాపూర్ చుముకెడిమా నుంచి ఒళ్లు గగుర్పాటు కలిగించే వీడియో ఒకటి వైరల్ గా మారింది. భారీ బండరాయి కారుపై పడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నాగాలాండ్లో ఒళ్లు గగుర్పాటు కలిగించే సంఘటన వెలుగులోకి వచ్చింది. చుముకెడిమా జిల్లాలో మంగళవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓల్డ్ చుముకెడిమ పోలీస్ చెక్పోస్టు సమీపంలో జాతీయ రహదారి 29పై సాయంత్రం 5 గంటల సమయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగింది
భారీ వర్షం కురుస్తున్నట్లు వైరల్గా మారిన వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో, కారులో వెళుతున్న వ్యక్తి ముందు పార్క్ చేసిన కార్లను వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న కారుకు సమీపంలో పర్వతం నుంచి భారీ రాయి పడింది. కింద పడిన కొద్ది క్షణాల్లోనే ఈ రాయి ముందున్న కారును తొక్కి కిందపడింది. ఈ ప్రమాదం చాలా విపరీతంగా ఉంది.ఆ రాయి వేగంగా కిందకి వచ్చి.. మూడు కార్లు శిధిలాలుగా మారింది. ప్రమాదం తాకిడికి రాళ్లు తగిలి మూడు కార్లు లోహపు కుప్పలా మారాయి. కారులో ఒక వ్యక్తి ఇంకా చిక్కుకుపోయాడని, అతడిని రక్షించే పని కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లు కొహిమా నుంచి వస్తుండగా వెనుక ఉన్న వాహనం డాష్ కెమెరాలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
