అబ్బాయి పుట్టలేదని.. పసిబిడ్డను నేలకేసి కొట్టిన తల్లి..!
బిడ్డను గోడకేసి కొట్టింది. అక్కడితో ఆగకుండా.. కాళ్లతో తొక్కేసింది. అప్పుడే పుట్టిన చిన్నారి జననాంగాలను తీవ్రంగా గాయపరించింది.
కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి అయినా అపురూపంగా చూసుకుంటుంది. కానీ.. ఓ మహిళ మాత్రం అతి కిరాతకంగా ప్రవర్తించింది. అబ్బాయి పుడతాడని ఆశపడితే.. అమ్మాయి పుట్టిందని అతి దారుణంగా ప్రవర్తించింది. బిడ్డను గోడకేసి కొట్టింది. అక్కడితో ఆగకుండా.. కాళ్లతో తొక్కేసింది. అప్పుడే పుట్టిన చిన్నారి జననాంగాలను తీవ్రంగా గాయపరించింది. అన్ని గాయాలతో ఆ చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కి చెందిన ఓ మహిళకు గతేడాది వివాహమైంది. వెంటనే గర్భం దాల్చగా.. జూన్ 21న ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తనకు ఆడపిల్ల పుట్టిందని జీర్ణించుకోలేకపోయింది. భర్త, అత్తమామలు మనకు దుర్గమ్మ పుట్టి, లక్ష్మీదేవి పుట్టిందని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పాపాయికి ఏం పేరుపెడితే బాగుటుందోనని తెలుసుకునేందుకు పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తల్లి.. పసికందుపై దారుణానికి ఒడిగట్టింది. విచక్షణా జ్ఞానం మరిచి తీవ్రంగా గాయపరిచింది. కిందపడేసి కాళ్లతో తొక్కుతు రాక్షసానందం పొందింది. అయితే ఈ దాడి జరిగే సమయంలో ఇంట్లో పిల్లలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దారుణానికి ఒడిగట్టిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.