దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్కు అందజేస్తోంది. మరి 16వ ఎపిసోడ్లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సీఎం ఎవరు..?
ఒక పాత తమిళ చిత్రంలో హాస్యనటులు గౌండమణి, సెంథిల్ తప్పిపోయిన అరటిపండు గురించి పోరాడే సన్నివేశం ఉంది. గౌండమణి తనకు రెండు అరటిపండ్లు తీసుకురమ్మని సెంథిల్కు చెబుతాడు. అయితే రెండు అరటిపండ్లు తీసుకొచ్చే క్రమంలో సెంథిల్ ఒకదానిని తింటాడు. మిగిలిన ఒకదానికి తీసుకొచ్చి గౌండమణికి చేతికి ఇస్తాడు. ఇంకో అరటిపండు ఏదని గౌండమణి అడిగినప్పుడల్లా.. సెంథిల్ మిగిలి ఉన్నదాన్ని ఉదహరిస్తూనే ఉంటాడు. ఈ సన్నివేశం తమిళనాట నవ్వులు పంచింది.
అయితే కేరళ ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో కూడా ఇలాంటి హాస్య అధ్యాయం బయటపడింది. లైఫ్ మిషన్ స్కామ్ కేసుకు సంబంధించి శివశంకర్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ డీల్కు సంబంధించి స్వప్న సురేష్కు శివ శంకర్కు మధ్య జరిగిన చాట్లు ‘‘సీఎం’’ అనే సంక్షిప్త పదంతో నిండిపోయాయి. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంలోని మరో సీనియర్ సిబ్బంది సీఎం రవీంద్రన్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్లో ఉద్యోగినిగా ఉన్న స్వప్న సురేష్.. ఈ డీల్లో ఉత్ప్రేరకంగా నిలిచింది. చాలా సున్నితమైన చాట్లలో.. సీఎంకు తెలిసే తాను అన్ని చేస్తున్నానని శివశంకర్ పునరావృతం చేయడం కనిపిస్తుంది. స్వప్న తాను ‘‘సీఎం’’ని కలిశానని చెప్పినప్పుడు.. సీఎం గురించి ప్రస్తావన కూడా ఉంది. ప్లమ్ జాబ్ పొందకుండా ఆమెను అడ్డుకున్న కొన్ని అంశాలను స్పష్టం చేసింది.
దీంతో ఆ కామెడీ సీన్ మాదిరిగానే.. ఈడీ అధికారులు ‘‘సీఎం’’ ఎవరనే విషయంపై కంగుతిన్నారు. ఇది నిజమైన ముఖ్యమంత్రిని సూచిస్తుందా లేక సీఎం రవీంద్రన్ని సూచిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఒక రకంగా ఆ వ్యక్తికి మాత్రం కొంత అడ్వాంటేజ్. బహుశా.. రాజకీయ నాయకులు ఏదైనా చట్టపరమైన పరిశీలన నుంచి తప్పించుకోవడానికి వారి సంబంధిత స్థానాలకు సంబంధించిన మొదటి అక్షరాలతో సిబ్బందిని కలిగి ఉండాలనే సూచనను ఇక్కడి నుంచి తీసుకొవచ్చు.
హౌజాట్ట్..!!
దీనిని పిచ్ను క్వీరింగ్ చేయడానికి సంబంధించిన విభిన్న సందర్భం అని పిలవండి. ఎందుకంటే రాజకీయాలు, క్రికెట్కు ఉమ్మడిగా ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో 'నమ్మ' చిక్కమగళూరులో క్రికెట్ టోర్నమెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండడం ఒక విచిత్రమైన సమన్వయ కథను చెబుతోంది. సరైన క్రికెట్ కిట్స్ను కొనుగోలు చేయడం కోసం ఎన్నికల సీజన్లో ఎక్కడ తలుపు తట్టాలో ఆ ప్రాంత యువతకు తెలుసు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించేందుకు ఎన్నికల్లో టిక్కెట్ ఆశించే స్థానిక నాయకులను వారు సంప్రదిస్తున్నారు.
ఈవెంట్ను ప్రారంభించేందుకు నాయకుడు అంగీకరించిన క్షణం.. యువత టోర్నమెంట్కు అవసరమైన బ్యాట్లు, బంతులు, హెల్మెట్లు మొదలైన వాటి సంఖ్యను వివరించే జాబితాను ఆ నాయకుడికి అందజేస్తారు. ఇక్కడ క్విడ్-ప్రో-కో అనేది సులభం. ఈ కార్యక్రమంలో నాయకుడిని ఉత్సాహపరిచేందుకు వారి గొంతుల పోయేలా నినాదాలు చేస్తామని కూడా యువత హామీ ఇస్తుంది.
అయితే ఇటీవల ఒక ఈవెంట్ను స్పాన్సర్ చేసిన స్థానిక నాయకులు.. తమ పోటీలో ఉన్న నాయకులు వేదికను పంచుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి మద్దతుగా యువత నినాదాలు చేసినా.. నాయకులు ఎవరూ కూడా ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తం చేయలేదు.
డబ్బు సంపాదించే సామర్థ్యం..
చాలా మంది రాజకీయ నాయకుల సన్నిహితుల కథలు.. చాలా తక్కువ డబ్బు ఉన్న స్థితి నుంచి చాలా ఎక్కువ డబ్బు ఉన్న స్థితికి చేరుతుంటాయి. అది నమ్మకంతో పాతుకుపోయిన ఇచ్చిపుచ్చుకునే సంబంధం అని అంతర్గత వ్యక్తులకు తెలుసు. అయితే బెంగళూరులోని మగాడి రోడ్డులో దాదాపు కర్ణాటక నేతలందరికీ బంగారం, నగదు అందజేసే ఓ నాయకుడు ఇటీవల తన వేళ్లను బాగా కాల్చుకున్నాడు. ఆయన తన అత్యంత విశ్వసనీయ రవాణాదారునికి (ట్రాన్స్పోర్టర్) చాలా నగదు, నగలను అప్పగించాడు. (హాలీవుడ్లోని ట్రాన్స్పోర్టర్ మూవీ సిరీస్ గురించి తెలిసిన వారికి ఈ పదం నమ్మకం, నిబద్ధతకు పర్యాయపదమని తెలుసు)
అయితే సదరు ట్రాన్స్పోర్టర్ నగదు, బంగారంతో పరారయ్యాడు. తప్పిపోయిన నల్ల గొర్రెల కోసం నాయకుడి సొంత సైన్యం వెతికినప్పటికీ.. అతని జాడ కనిపించలేదు. లావాదేవీ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఒప్పందం కానందున పోలీసు ఫిర్యాదు దాఖలు చేయడం అనేది గందరగోళంగా మారింది. అయితే అతడి జాడకు సంబంధించి పురోగతి లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే అతనిని గుర్తించారు. అయితే అప్పటికి నగదులో చాలా భాగం మాయమైంది. అవసరమైన వారికి నగదు, విలువైన వస్తువులను కొరియర్ చేయడానికి కొత్త వ్యూహాన్ని మళ్లీ ఆవిష్కరించే సమయం ఇది.
కుక్కింగ్ ఓట్స్..
ఎన్నికల సమయంలో ఓటర్లకు ఉచితంగా కుక్కర్లను పంపిణీ చేయడం కొత్తేమీ కాదు. కానీ ఈ ‘‘బహుమతులు’’ చాలా వరకు నాణ్యత లేకపోవడంతో.. ప్రారంభంలోనే పేలడం మొదలెట్టాయి. దీంతో ఓటర్లలో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో వారు ‘‘కుక్కర్ బాంబులకు’’ మర్యాదపూర్వకంగా నో చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువగా చౌక తయారీదారుల నుంచి సామూహికంగా కొనుగోలు చేస్తుండటంతో.. కుక్కర్లను పంపిణీ చేయడానికి షార్ట్కట్ను కనుగొనలేదు.
అయితే ఆర్కే నగర్కు చెందిన ఒక రాజకీయ నాయకుడు కుక్కర్కు భద్రతను ధృవీకరించడానికి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. తమ కుక్కర్ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రాండెడ్ కంపెనీ తయారు చేసిందని.. ఇది ఐదేళ్ల హామీ.. ఐఎస్ఐ గుర్తుతో వస్తుందని చెబుతున్నారు. ఇది గూగుల్లో అత్యుత్తమ రేటింగ్ను కలిగి ఉందని పేర్కొంటూ.. చాలా పెద్ద జాబితానే ముందుకు తీసుకొచ్చారు. అలాగే కుక్కర్లపై ఫిర్యాదుల విషయంలో ఉచిత సేవలను కూడా అందిస్తామని ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కుక్కర్ పంపిణీని పునఃప్రారంభించేందుకు ఈ నాయకుడు తనదైన మార్గంలో ముందుకు కొనసాగుతున్నారు.
ఊహించిన దానికంటే చాలా తక్కువగా..
యూపీ అసెంబ్లీలోని సభ్యులందరూ చోటే నేతాజీకి ఎదురుదాడి చేస్తారని ఊహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఛోటే నేతాజీ తండ్రి గురించి చేసి వ్యాఖ్యలపై తప్పకుండా ఆయన సమాధానం పవర్ ప్యాక్గా ఉంటుందని ఆయన సొంత పార్టీ నేతలు కూడా భావించారు. అయితే చోటే నేతాజీ మాత్రం ఇందుకు భిన్నంగా నడుచుకున్నారు. కౌంటర్ పాయింట్ దాడి కాకుండా.. భావోద్వేగ విజ్ఞప్తిని ఆశ్రయించారు. దీంతో అధిక ఆవేశపూరిత వాతావరణం గందరగోళంగా మారింది. అయితే చోటే నేతా తన తండ్రిపై తదుపరి వ్యాఖ్యలను ఆపాలనే ఉద్దేశ్యంతో రాజీ పడుతున్నట్లు కనిపించింది.
గొప్ప అంచనాలు..
ఇటీవల ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ గమనిస్తే భారీ రాజకీయ మార్పు జరగబోతుందా? అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ‘‘మారుతున్న సీజన్కు సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్తో డిప్యూటీ సీఎం తన ఫోటోను ట్వీట్ చేయడంతో అతని మద్దతుదారులు అందరూ ఆశ్చర్యపోయారు. ఢిల్లీలో గానీ, యూపీలో గానీ ఆయనకు భారీ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ఈ ట్వీట్లు సూచిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో పాత్ర ఉంటుందని కొందరు ఊహించగా.. ఆయన త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని డైహార్డ్ మద్దతుదారులు కోరుకుంటున్నారు.
అయితే ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం ఎలాంటి తదుపరి సమాచారాన్ని జోడించలేదు. అయితే ఫోటో, ట్వీట్పై సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు ఎవరికి వారే ఏదో ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఆయన అనుచరులు మాత్రం వేడుకలకు సిద్ధమ