Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో దారుణం... నలుగురిని బలితీసుకున్న ప్రేమ పెళ్లి వ్యవహారం

ప్రేమ పెళ్లి వ్యవహారం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకున్న దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

Four persons murdered in karnataka
Author
Raichur, First Published Jul 12, 2020, 7:50 AM IST

బెంగళూరు: ప్రేమ పెళ్లి వ్యవహారం నలుగురి నిండు ప్రాణాలను బలితీసుకున్న దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి అత్యంత పాశవికంగా ఈ హత్యలకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు  కూడా వున్నారు. 

ఈ హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని  రాయచూర్ జిల్లా సింధునూరు కు చెందిన యువతీ, యువకులు ప్రేమించుకుని కుటుంబసభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  

read more  కూతుళ్లపై కొన్నేళ్లుగా భర్త అత్యాచారం, భార్య మద్దతు: కూతుళ్లను కొట్టి....

ఈ క్రమంలో యువకుడి కుటుంబసభ్యులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు.  సావిత్రమ్మ(55), శ్రీదేవి(38), హనుమేశ్(35), నాగరాజు(33) అనే నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఇది కూడా యువతి బంధువుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లను రప్పించి ఆదారాలను సేకరించారు. ఈ హత్యకు పాల్పడిని నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios