Asianet News TeluguAsianet News Telugu

దివ్యాంగురాలిపై నలుగురు ఆర్మీ జవాన్ల అత్యాచారం...రెండేళ్లుగా ఘాతుకం

దేశ రక్షణ కోసం కాపలాకాస్తూ దేశ సేవ చేయాల్సిన మహోన్నత బాధ్యతను మరిచి నలుగురు ఆర్మీ జవాన్లు దేశం తలదించుకునే నీచమైన పని చేశారు.  ఆర్మీ హాస్పిటల్లో పనిచేసే ఓ దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
 

four army officers raped physically handicaped woman
Author
Pune, First Published Oct 17, 2018, 3:02 PM IST

దేశ రక్షణ కోసం కాపలాకాస్తూ దేశ సేవ చేయాల్సిన మహోన్నత బాధ్యతను మరిచి నలుగురు ఆర్మీ జవాన్లు దేశం తలదించుకునే నీచమైన పని చేశారు.  ఆర్మీ హాస్పిటల్లో పనిచేసే ఓ దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  పుణే సమీపంలోని ఖాద్కీ మిలటరీ హాస్పిటల్లో ఓ 30ఏళ్ల మూగ, చెవిటి వితంతు మహిళ గ్రేడ్ 4 ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెకు ఎవరూ లేకపోవడంతో పాటు దివ్యాంగురాలు కావడంతో ఓ ఆర్మీ జవాన్ ఆమెపై కన్నేశాడు. ఓ రోజు నైట్ డ్యూటీలో వున్న ఆమెను బాత్రూంలోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

అయితే ఈ దారుణంపై బాధితురాలు ఓ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసింది. అయితే అతడు కూడా తన కామ వాంఛ తీర్చాలని...లేకుంటే ఈ విషయం బైటపెట్టి పరువు తీస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇలా అత్యాచారానికి పాల్పడుతూ వీడియోలు తీసిన కీచకులు వాటిని తమ స్నేహితులకు కూడా అందించారు. వీటిని చూపించి బెదిరిస్తూ గత రెండేళ్లుగా నలుగురు ఆర్మీ జవాన్లు ఈ దివ్యాంగురాలిపై అత్యాచారం చేస్తున్నారు.

ఆస్పత్రిలోని అధికారులతో పాటు ఉన్నతాధికారులకు తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకునేవారు కాదని బాధితురాలు ఆవేధన వ్యక్తం చేసింది. కనీసం నైట్ డ్యూటీని మార్చమని చెప్పినా వినలేదని బోరుమంది. చివరకు ఓ సామాజిక సంస్థ సహకారంతో ఈ బాధితురాలిపై జరుగిన అఘాయిత్యం గురించి బైటపడింది.

ఆ సంస్థ ప్రతినిధులు బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు ఆర్మీ అధికారులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.   

Follow Us:
Download App:
  • android
  • ios