Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ : ఉదంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన నాలుగు బోగీలు

జ‌మ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో (Udhampur express ) శుక్ర‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో రెండు ఏసీ కోచ్‌ల‌లో మంట‌లు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే మ‌రో రెండు ఏసీ కోచ్‌ల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

four ac coaches of jammu tawi durg Udhampur express
Author
Madhya Pradesh, First Published Nov 26, 2021, 5:46 PM IST

జ‌మ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో (Udhampur express ) శుక్ర‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో రెండు ఏసీ కోచ్‌ల‌లో మంట‌లు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే మ‌రో రెండు ఏసీ కోచ్‌ల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

రాజ‌స్థాన్‌లోని ధౌల్‌పూర్ (Dhaulpur ) , మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) మోరినా (Morena ) మ‌ధ్య ఈ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుందని రైల్వే వర్గాలు తెలిపాయి. హేతంపూర్‌ నుంచి ఝాన్సీ‌కి (Jhansi) రైలు వెళ్తుండ‌గా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. అయితే ఓ కోచ్‌లోని ఏసీలో మంట‌లు చెల‌రేగ‌డంతోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే సకాలంలో గుర్తించి ప్రయాణీకులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios