New Delhi: ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్‌కు న్యాయ‌స్థానం 4 నెలల జైలుశిక్ష విధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)లో వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్‌ను నడిపేందుకు సంబంధించిన కేసులో షోకీన్ నిందితుడు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు. పలుమార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాని మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ కు ఢిల్లీ కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. 

Ex Delhi MLA Gets 4-Month Jail Term: ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్‌కు న్యాయ‌స్థానం 4 నెలల జైలుశిక్ష విధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)లో వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్‌ను నడిపేందుకు సంబంధించిన కేసులో షోకీన్ నిందితుడు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు. పలుమార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాని మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ కు ఢిల్లీ కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

వివ‌రాల్లోకెళ్తే.. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలుమార్లు సమన్లు పంపినప్పటికీ తమ ఎదుట హాజరు కాకపోవడంతో ఢిల్లీలోని మాజీ ఎమ్మెల్యే రంబీర్ షోకీన్‌కు ఢిల్లీ కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)లో వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్‌ను నడిపేందుకు సంబంధించిన కేసులో షోకీన్ నిందితుడు.మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీవోసీఏ) నిబంధనల ప్రకారం ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు. 

ఆగస్టు 26న షోకీన్‌కు జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్.. ప్రొబేషన్ పై విడుదల చేయడానికి ఇది సరైన కేసు కాదని తన ఉత్తర్వులో పేర్కొన్నారు. దోషిని గతంలో ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించారు. అతను అరెస్టు చేయబడ్డాడు, ఆ తర్వాత అతను కస్టడీ నుండి తప్పించుకునీ, కొంత కాలం తర్వాత లొంగిపోయాడు. ఈ వాస్తవాల దృష్ట్యా, ప్రస్తుత కేసు విచారణలో దోషిని విడుదల చేయడానికి తగినది కాద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. న్యాయమూర్తి మాట్లాడుతూ కేసు వాస్తవాలు-పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, న్యాయం చేయడానికి, దోషి రంబీర్ షోకీన్‌కు నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష విధించడం సహేతుకంగా ఉంటుందని అన్నారు.

అయితే, ఈ కేసులో షోకీన్‌కు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. అతను శాసనసభ సభ్యుడిగా ఉన్నాడనీ, దాని కారణంగా అతను మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి వచ్చిందని పేర్కొంది. షోకీన్ తరఫు న్యాయవాదులు కనీస శిక్ష విధించాలని కోరగా, ప్రస్తుత కేసులో తమ క్లయింట్‌ను ఇరికించారని పేర్కొన్నారు.