Asianet News TeluguAsianet News Telugu

సొంత చెల్లిని వ్యభిచారంలోకి దింపిన అక్క.. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..

ఓ యువతిని ఆమె సొంత అక్కే వ్యభిచార కూపంలోకి నెట్టింది. ఆమెతో బలవంతంగా పాడు పనులు చేయించింది. అయితే ఆ యువతి తనకు తెలిసిన ఓ వ్యక్తితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది.

Forced into prostitution by elder sister and killed after protesting in Jharkhand
Author
Ranchi, First Published Oct 26, 2021, 2:34 PM IST

ఓ యువతిని ఆమె సొంత అక్కే వ్యభిచార కూపంలోకి నెట్టింది. ఆమెతో బలవంతంగా పాడు పనులు చేయించింది. అయితే ఆ యువతి తనకు తెలిసిన ఓ వ్యక్తితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆ యువతిని ఆమె అక్క, మరికొందరు కలిసి హత్య చేశారు. ఏడు నెలల క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతి మృతదేహాన్ని జార్ఖండ్‌లోని (Jharkhand) సోనార్ డ్యామ్ సమీపంలో పోలీసులు గుర్తించారు. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. యువతిని హత్య చేసిన నిందితులను ఆమె అక్కలు రాఖీ దేవి (30), రూప దేవి(25), బావ ధనుంజయ్ అగర్వాల్ (30), రాఖీ దేవి లవర్స్ ప్రతాప్ కుమార్, నితీష్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం నితీష్ పరారీలో ఉండగా.. మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం మృతురాలి తలకు గాయం కావడం వల్లే చనిపోయిందని తేలింది. అయితే ఆమె అక్కలు మాత్రం Suicide చేసుకుని చనిపోందని ఆరోపించారు. 

పోలీసులు తెలిపిన వివరాలు.. బాధిత యువతి (17) తల్లిదండ్రులకు మొత్తం ఐదురుగు సంతానం. అందులో యువతి నాలుగో బిడ్డ. అయితే ఆమె తల్లిదండ్రులు మరణించడంతో.. తన అక్క రాఖీ దేవితో కలిసి సుద్నాలో నివాసం ఉండేది. అయితే రాఖీ దేవి prostitution నిర్వహించేది. రాఖీ దేవి, ధనుంజయ్‌తో కలిసి యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కస్టమర్ల వద్దకు పంపేవారు. అయితే యువతి ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకుంది.. ఈ క్రమంలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే రాఖీ దేవి దీనికి అంగీకరించలేదు.

Also read: భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. కానీ ఇది సమయం కాదు.. టీ20లో భారత్‌పై పాక్ విజయం తర్వాత ఇమ్రాన్ ఖాన్

అదే సమయంలో రాఖీ దేవితో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్న ప్రతాప్, నితీష్లు.. ఆమె చెల్లిపై(బాధిత యువతి) కన్నేశారు. ఆమెతో శారీరక సంబంధాన్ని కోరుకున్నారు. రాఖీ దేవి ఇంటికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవారు. ఇందుకు రాఖీ దేవి వారికి సాయం చేసింది. 

Also read: జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

హత్యకు రెండు రోజుల ముందు ప్రతాప్ రాఖీ దేవి ఇంటికి వచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారం.. యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ఉరికి వేలాడ దీశాడు. హత్య తర్వాత అక్కడికి చేరుకున్న రాఖీ దేవి.. ధనుంజయ్‌కు ఫోన్ చేసింది. దీంతో ధనుంజయ్ వెంటనే ఆటోతో అక్కడికి చేరుకున్నాడు.  మృతురాలి బట్టలను మార్చారు. ఆ తర్వాత మిగతా నిందితులందరూ కలిసి.. మృతదేహాన్ని ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios