Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షం...గోడకూలి ఐదుగురు మృతి

గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పూణే నగరంలోని సహకారనగర్ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు వచ్చి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. 
 

Five killed as wall collapses following heavy rain in Pune
Author
Hyderabad, First Published Sep 26, 2019, 8:28 AM IST


గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.... ఈ భారీ వర్షం కారణంగా గోడ కూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్ర లోని పూణే లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పూణే నగరంలోని సహకారనగర్ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు వచ్చి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. 

పూణే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. ముంబై నగరంలోని ఖర్ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో పదేళ్ల బాలిక మరణించింది. బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. భారీవర్షాల వల్ల పాత భవనాలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios