ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో బాస్మండి ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ని బాస్మండి ప్రాంతంలో శుక్రవారంనాడు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 500 బట్టల దుకాణాల్లో అగ్ని ప్రమాదం నెలకొంది. ఎఆర్ టవర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న కాంప్లెక్స్ లకు వ్యాపించాయి. మసూద్ టవర్ -1 , మసూద్ టవర్ 2, హమ్రాజ్ కాంప్లెక్స్ లకు మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు . సుమారు 25 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. పండుగల సమయంలో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన బట్టలు ఈ ప్రమాదంలో దగ్దమయ్యాయి.
ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు .
