Asianet News TeluguAsianet News Telugu

ముంబై స్క్రాప్ యార్డులో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం నాడు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఓ స్క్రాప్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న ప్రాంతంలో భారీగా మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది.

fire breaks out at scrap yard in mumbai lns
Author
Mumbai, First Published Feb 5, 2021, 3:59 PM IST


ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం నాడు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఓ స్క్రాప్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న ప్రాంతంలో భారీగా మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది.

ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. 10 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్క్రాప్ యార్డుకు సమీపంలోనే మురికవాడల్లో పేదలు నివాసం ఉంటున్నారు. ఈ మంటలు బస్తీల వైపు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఫైరింజన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ స్క్రాప్ యార్డులో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios