వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..
.దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ లోని ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఈ ఏడాది మేలో సూరత్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో దాదాపు 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరవక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.