Ola Scooter: Ola స్కూటర్ లో తల్లెత్తిన సాంకేతిక కారణాల వల్ల తన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని ఓ తండ్రి ఆరోపించాడు. స్కూటర్ పనితీరులో ఎలాంటి సమస్యలు లేవని, పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశామనీ, స్కూటర్ లో ఎటువంటి సమస్య లేవని ఓలా కంపెనీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. ఓలా డిసెంబర్ 2021లో డెలివరీలను ప్రారంభించినప్పటి నుండి.. అనేక ఫిర్యాదులను ఎదుర్కొంది.
Ola Scooter: తరుచుగా పెట్రో ధరలు క్రమంగా పెరుగుతుండటంతో పలువురు వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై దృష్టి సారిస్తున్నారు. అయితే.. ఈ వెహికల్స్ వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నా.. పలు సమస్యలున్నట్టు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలలుగా.. ఎలక్ట్రిక్ స్కూటర్స్ పేలడం, అనేక ప్రమాదాలు వెలుగులోకి రావడం.. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం వంటి అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ విషయంపై కేంద్రం ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. ఒకవేళ ఈ విచారణలో కంపెనీల లోపాలు ఉన్నట్టు తేలితే భారీ జరిమానాలు, ఇతర చర్యల తీసుకుంటామని హెచ్చరించారు.
తాజాగా ఓ Ola ఎలక్ట్రిక్ స్కూటర్ నాణ్యత ప్రమాణాలపై ఓ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లలో ఒక్కడైన తన కుమారుడు ప్రమాదానికి కారణం Ola ఎలక్ట్రిక్ స్కూటరేననీ, ఆ స్కూటర్లో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవనీ, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో సాంకేతిక లోపం కారణంగా తన కొడుకు మార్చి 26న ప్రమాదానికి గురయ్యాడని ఆ తండ్రి ఆరోపించారు. తన కుమారుడు స్పీడ్ బ్రేకర్ వద్ద Ola ఎలక్ట్రిక్ స్కూటర్ను వేగాన్ని నియంత్రించే సమయంలో.. సాంకేతిక కారణాలు తల్లెత్తి..వేగం తగ్గడానికి బదులు.. పొరపాటున వేగం ఎక్కువైందనీ.. తత్ఫలితంగా బైకు కిందపడిందనీ, ఈ ప్రమాదంలో తన కొడుకు ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయ్యిందని, కుడి చేతికి 16 కుట్లు పడ్డాయని బల్వంత్ సింగ్ అనే తండ్రి ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రారంభం నుంచే.. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ నాణ్యత, డెలివరీ,అమ్మకాలపై వివాదాలను ఎదుర్కొంటుంది. వారు డిసెంబర్ 2021లో డెలివరీలను ప్రారంభించినప్పటి నుండి కంపెనీ అనేక ఫిర్యాదులను ఎదుర్కొంది. వారి ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ప్రో పనితీరుపై అనేక ఆరోపణలున్నాయి.
ఈ ట్విట్ పై Ola యాజమాన్యం స్పందించింది. స్కూటర్ పనితీరులో ఎలాంటి సమస్యలు లేవని పేర్కొంటూ.. ఓలా ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే.. స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశామనీ, స్కూటర్ లో ఎటువంటి సమస్య లేదనీ, దయచేసి సురక్షితంగా ప్రయాణించమని, సదరు వ్యక్తికి జాగ్రత్తగా ప్రయాణించమనీ ఓలా యాజమాన్యం సలహా ఇచ్చింది. అక్కడితో వారి ట్విట్ లు ఆగిపోకుండా.. Ola ప్రతిస్పందనపై బల్వంత్ సింగ్ ఇలా రాసుకోచ్చారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకునే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీలకు గురువారం జరిమానా విధించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ప్రకటనను జత పరిచి మరో ట్విట్ ను పోస్టు చేశారు. గత రెండు నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ అయిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలపై విచారణ జరిపి పరిష్కార చర్యలను సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామనీ,నివేదికల ఆధారంగా డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి హెచ్చరించిన విషయం తెలిసిందే.. గడ్కరీ వ్యాఖ్యలపై బల్వంత్ సింగ్ స్పందిస్తూ.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడం ప్రారంభించినప్పటి నుండి అనేక ఫిర్యాదులతో నిండిపోయిందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల పుణేలో Ola E-scooter భారీ మంటల్లో, పొగలు కక్కుతూ కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియోను ఆటో కార్ ఎడిటర్ హర్మబ్ద్ సొరబ్జీ షేర్ చేస్తూ.. ఈ ఘటనపై వివరణ కోరుతూ ఓలా ఎలక్ట్రిక్ను ట్యాగ్ చేశారు. ఈ ప్రమాదాలపై ఓలా స్పందించింది. ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వివరించిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జనం.. చర్చ సాగుతున్న నేపథ్యంలో కంపెనీ కూడా అధికారిక ప్రకటన చేసింది. ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలిపింది. అదృష్టశాత్తువు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనితో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.