ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీవీలర్ ను ఢీకొన్న ట్రక్.. ఏడుగురు మృతి
Katihar: ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వెనుక నుండి ఒక ట్రక్కు త్రీవీలర్ను ఢీకొట్టింది. ట్రక్ వేగంగా వెళ్లేలోపు ఆటోరిక్షా కొన్ని మీటర్ల పాటు ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Bihar Road accident: బీహార్లోని కతిహార్లో ప్రయాణికులతో నిండిన ట్రక్కును ఆటోరిక్షా ఢీకొనడంతో చిన్నారులతో సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే 81 దిగ్రీ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను త్రీవీలర్లో నుంచి బయటకు తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
— Press Trust of India (@PTI_News) January 9, 2023
ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వెనుక నుండి ఒక ట్రక్కు త్రీవీలర్ను ఢీకొట్టింది. ట్రక్ వేగంగా వెళ్లేలోపు ఆటోరిక్షా కొన్ని మీటర్ల పాటు ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, ఖేరియా గ్రామం నుంచి కతిహార్కు ఆటోరిక్షా వస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలిక ఉంది.
కాగా, త్రీవీలర్ లో ప్రయాణిస్తున్న కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇటార్సీకి వెళ్తున్నారనీ, దాని కోసం వీరు కతిహార్ నుండి రైలు ఎక్కవలసి ఉందని సమాచారం. పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి NH 81పై రాత్రి 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా ఆటోరిక్షాలో ఉన్నవారంతా చనిపోయారు. ఖేరియా పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ త్రీవీలర్ను అద్దెకు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికులు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై టైర్లను తగులబెట్టి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. ఆగ్రహించిన ఆందోళనకారులను శాంతింపజేసి, కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించే ప్రయత్నాలు జరిగాయి. ట్రక్కును, డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదంలో ముగ్గురు మృతి..
బీహార్లోని గయాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గయా-టేకారి రహదారిపై కేవాలి సమీపంలో ట్రక్కు-మోటార్సైకిల్ను నేరుగా ఢీకొన్న సంఘటన చందౌతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. గయలో ప్రస్తుతం చలి ఎక్కువగా ఉందని, పొగమంచు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా బైక్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. మృతులు పంచన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేపా పంచాయితీలోని విషుంగంజ్ నివాసితులు మో సాదిక్, మో తంజీర్ మో మిస్బాగా గుర్తించారు. సమాచారం మేరకు ముగ్గురూ ఒకే బైక్పై రైల్వేస్టేషన్కు వెళ్తున్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న హైవా బైక్ను ఢీకొట్టింది.