Asianet News TeluguAsianet News Telugu

బతికొస్తుందని మహిళ మృతదేహం వద్ద రెండు రోజులుగా ప్రార్థనలు.. దుర్వాసన వస్తుండడంతో...

చనిపోయిన తల్లి ప్రార్థనలు చేసే లేచి వస్తుందని.. రెండు రోజులుగా మృతదేహం వద్ద పూజలు చేశారు. ఇద్దరు కొడుకులు, భర్త.. అయితే దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

family members doing witchcraft to mothers dead body to alive her in tamilnadu
Author
First Published Nov 12, 2022, 8:39 AM IST

తమిళనాడు : చనిపోయిన మహిళ బతికి వస్తుందన్న మూఢనమ్మకంతో మూడు రోజులపాటు మృతదేహం వద్ద కుటుంబ  సభ్యులు ప్రార్ధన చేసిన ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మధురై ఎస్ఎస్  కాలనీకి చెందిన బాలకృష్ణ భార్య మాలతి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలకృష్ణన్ ఓ ప్రైవేట్ హోటల్లో మేనేజర్. కుమారులు ఇద్దరు మెడిసిన్ చదువుతున్నారు. ఈ నెల 8న మాలతి  అనారోగ్యంతో ఆస్పత్రిలో మరణించింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చిన కుటుంబీకులు.. బంధువులకు సమాచారం ఇవ్వలేదు. 

ఇంట్లోనే ఐస్ బాక్స్ లో మృతదేహాన్ని ఉంచారు. మూడు రోజులు అవుతున్నఅంత్యక్రియలు చేయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తీసుకు వెళుతుండగా.. అడ్డుకున్న కుటుంబీకులు.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అలా చేస్తే.. అరెస్టు చేస్తామని పోలీసులు వారిని హెచ్చరించారు. దీంతో.. మృతదేహాన్ని సొంతూరైన తిరునెల్వేలి జిల్లా కళకాట్టికి తీసుకెళ్లారు. హిందువులైన బాలకృష్ణ కుటుంబం కొన్నేళ్ళ క్రితం క్రైస్తవ మతం స్వీకరించింది. ప్రార్థనలు చేస్తే చనిపోయిన మాలతి ప్రాణాలతో తిరిగి వస్తుందని నమ్మారు. అందుకే దుర్వాసన వస్తున్నా ప్రార్థనలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 

15 ఏళ్ల కూతురిని బలవంతంగా తన లవర్‌తో పెళ్లి చేసిన తల్లి.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో దారుణమైన విస్తుపోయే ఘటన జూన్ 30న వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తమ కుమార్తె మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే దాచిపెట్టారు తల్లిదండ్రులు. ఆమెను తిరిగి బతికించేందుకు క్షుద్రపూజలు చేశారు. మృతదేహం కుళ్లిపోయి.. దాన్నుంచి వాసన వస్తున్నప్పటికీ క్షుద్రపూజలు అలాగే కొనసాగించారు. వాసన భరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ లోని కర్చన ప్రాంతం..దిహా  గ్రామానికి చెందిన అంతిమ యాదవ్ (18) అనే యువతి 5 రోజుల క్రితం ఏదో అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందింది. అయితే, ఆమె చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు తెలియనివ్వలేదు. ఇంట్లో లోపలి నుంచి గడియ పెట్టుకుని..  ఆమెను బతికించేందుకు ఒక మాంత్రికుడితో కలిసి క్షుద్ర పూజలు చేయించారు. ఐదు రోజులు గడుస్తున్నా.. అదే నమ్మకంతో పూజలు చేస్తున్నారు. దీంతో, మృతదేహం కుళ్లిపోయి.. దాని నుంచి  దుర్వాసన రావడం మొదలైంది. దీంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది.  ఆ వాసన మృతురాలి ఇంట్లో నుంచి రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు చుట్టుపక్కల వాళ్ళు.  

సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న తంతు.. దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. యువతి మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కూతురిని బతికించుకోవాలని క్షుద్ర పూజలు చేస్తున్న ఆ కుటుంబీకులు ఈ ఐదు రోజుల నుండి ఏమీ తినకుండా.. కేవలం గంగాజలం మాత్రమే తాగుతూ క్షుద్రపూజలో పాల్గొన్నట్లు  సమాచారం తెలిసింది. ఐదు రోజులుగా ఏమీ తినక పోవడం..  మృతదేహం కారణంగా ఇంట్లో వ్యాపించిన దుర్వాసనలతో.. ఇంట్లో ఉన్న మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.  వారందరినీ చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని.. అందుకే ఈ ఘటనపై వారిని ముందుగా విచారించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios