Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటో ఉంటే తప్పేంటి- కేరళ హైకోర్టు

 కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉంటే తప్పేంటని కేరళ హైకోర్డు వ్యాఖ్యానించింది. ఆయన ఇప్పటికే మన దేశ ప్రధానే కదా అని తెలిపింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై మోడీ ఫొటో ఉండటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సోమవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. 
 

Exempt if there is a photo of the Prime Minister on the vaccination certificate - Kerala High Court
Author
Kerala, First Published Dec 13, 2021, 10:03 PM IST

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటో ఉంటే త‌ప్పేంటి అని కేర‌ళ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఆయ‌న ఇప్పకీ భార‌త దేశ ప్ర‌ధానే క‌దా అని తెలిపింది. క‌రోనా వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో ఉండ‌టాన్ని స‌వాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సోమ‌వారం కేర‌ళ హైకోర్టులో వాద‌న‌లు కొన‌సాగాయి. ఈ సంద‌ర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. కేర‌ళ‌కు చెందిన పీటర్ మైలిపరంపిల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ పివి కున్హికృష్ణన్ విచారించారు. పిటిష‌నర్ త‌ర‌ఫు లాయ‌ర్ వాద‌న‌లు వినిపిస్తూ.. ‘‘తన పిటిషనర్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల కోసం డబ్బులు చెల్లించారు, అయినా ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో వచ్చింది. దీంతో పాటు ఆ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌లో సొంత అడ్ర‌స్ అని పేర్కొని ఉంది. ఇది వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌ల్గించే అంశం’’ అని తెలిపారు. ప్ర‌ధాని ఫొటోలేని వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ కావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా అని పిటిష‌న‌ర్ ను న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. పిటిష‌న‌ర్ నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో న్యాయ‌మూర్తి అసంతృప్తికి గుర‌య్యారు. ఇది కేవ‌లం కోర్టు స‌మ‌యాన్ని వృథా చేసేందుకు వేసిన పిటిష‌న్ అని భావించారు. ‘‘దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ లో ప్ర‌ధాని ఫొటో ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది క‌నిపించ‌లేదు. కానీ మీకే ఎందుకు ప్ర‌ధాని ఫొటో ఉండ‌టం త‌ప్పుగా క‌నిపిస్తోంది’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రధానిని చూసి పిటిషనర్ ఎందుకు సిగ్గుపడుతున్నారు ? ఎవ‌రికైనా రాజ‌కీయంగా భిన్న అభిప్రాయాలు ఉండ‌వ‌చ్చ‌ని, కానీ న‌రేంద్ర మోడీ మ‌న ఇప్ప‌టికీ దేశానికి ప్ర‌ధానమంత్రే’’ అని న్యాయమూర్తి అన్నారు. 

కాశీలో శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు.. దేశాభివృద్ధికి కాశీ సహకారం అంతులేనిది: ప్రధాని నరేంద్ర మోదీ
ఇదిలా ఉండగా, పీఎం కేఆర్ అండ్ ట్రస్ట్, దాని అధికారిక వెబ్‌సైట్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమ‌వారం బాంబే హైకోర్టు ముందుకొచ్చింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచార‌ణ చేపట్టింది. ఈ అంశంపై స‌మాధానం చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాని ఆదేశించింది. ఈ కేసు ‘‘చాలా ముఖ్యమైనది’’గా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంపై సమాధానం చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ను ఆదేశించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి  రెండు వారాల సమయం కోరారు. కాగా ఈ పిటిష‌న్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన విక్రాంత్ చవాన్ దాఖలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios