ఎన్నికల హీట్: త్రిపురలో బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ.. కాంగ్రెస్, వామపక్షాల సంయుక్త ప్రకటన
Agartala: త్రిపురలో 'ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని' కోరుతూ కాంగ్రెస్, సీపీఐ(ఎం) సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకునే విషయంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) సహా పలు వామపక్ష పార్టీలు సానుకూల ధోరణిలో ముందుకు సాగుతున్నాయి.
Tripura Assembly elections: వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజల్లోకి వెళ్లడానికి ర్యాలీలు, యాత్రలు నిర్వహిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను మరింతగా పెంచింది. ఇప్పటికే ఒక యాత్రను పూర్తిచేసిన బీజేపీ మరో యాత్రకు సిద్దమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి బీజేపీ చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త యాత్రను ఎన్నికలకు ముందు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకునే విషయంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) సహా పలు వామపక్ష పార్టీలు సానుకూల ధోరణిలో ముందుకు సాగుతున్నాయి.
త్రిపురలో అధికార బీజేపీ ఐదేళ్ల నియంతృత్వాన్ని అంతం చేసేందుకు ప్రజలు కలిసి రావాలని వామపక్షాలు, కాంగ్రెస్ సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, పీసీసీ అధ్యక్షుడు బిర్జిత్ సిన్హా, సీపీఐ కార్యదర్శి యుధిష్ఠిర్ దాస్, సీపీఐ ఎంఎల్ కార్యదర్శి పార్థ కర్కర్, ఆర్ఎస్పీ కార్యదర్శి దీపక్ దేబ్, ఫార్వర్డ్ బ్లాక్ సెక్రటరీ పరేశ్ సర్కార్ ప్రకటన చేశారు. త్రిపురలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఏకపక్ష అరాచక పాలన ఊహకు అందని విధంగా ఉందన్నారు. పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఉచిత ఓటు హక్కు నిరాకరించబడిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ప్రహసనంగా మారాయి. హత్యలు, దాడులు సర్వసాధారణమయ్యాయి. ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా కమిషన్ చొరవ చూపాలని నేతలు ఆ ప్రకటనలో కోరారు.
బీజేపీకి చెక్ పెట్టేందుకు..
2023 ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశంపై ప్రతిపక్ష సీపీఎం,, కాంగ్రెస్ సహా త్రిపురలోని మరికొన్ని వామపక్షాలు సానుకూలంగా ముందుకు సాగాయి. "ప్రజాస్వామ్యం పునరుద్ధరణ, చట్టాల పునరుద్ధరణ, స్వేచ్ఛా ఎన్నికల నిర్వహణ" కోరుతూ పార్టీలు మంగళవారం అపూర్వమైన ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. రాష్ట్రంలో ఏకపార్టీ నిరంకుశ పాలన కొనసాగుతున్నదని బీజేపీ విమర్శల దాడిని కొనసాగించాయి. "ప్రతిపక్ష పార్టీల స్వతంత్ర పనితీరు వారి గొంతులను నొక్కడం ద్వారా స్థిరీకరించబడింది.. ఎన్నికలను ఒక ప్రహసన సంఘటనగా తగ్గించారు" అని ప్రకటన పేర్కొంది.
హత్య, ఉగ్రవాద కార్యకలాపాలు, దోపిడీ వంటి సంఘటనలు ఇప్పుడు రాష్ట్రంలో సాధారణ లక్షణాలు గా మారాయంటూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అలాగే, రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక చర్యలను నిర్వహించడానికి పాలక పార్టీకి సహాయం చేస్తున్నందుకు పరిపాలన-పోలీసు యంత్రాంగలపైనా విమర్శాలు గుప్పించాయి. రాష్ట్రంలోని ప్రజలు, వారి సంఘం, గుర్తింపు-విశ్వాసంతో సంబంధం లేకుండా, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా నిరసన గళం వినిపించాలనీ, ప్రజా అణచివేత పాలనను అంతం చేయడానికి అందరూ కలిసి ముందుకు రావాలని కోరారు. ఆకస్మిక, ముఖ్యమైన రాజకీయ పరిణామంపై, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం-చట్ట పాలన పునరుద్ధరణ ఆవశ్యకతపై లౌకిక-ప్రజాస్వామ్య రాజకీయ పార్టీల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి ఉమ్మడి ప్రకటన కీలకమని సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు పబిత్రా కర్ అన్నారు. కాంగ్రెస్తో ఎన్నికల సర్దుబాటుకు అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.