Asianet News TeluguAsianet News Telugu

గోవాలో ఆప్‌కి ఈసీ గుర్తింపు.. పార్టీ కార్యకర్తలకు కేజ్రీవాల్ శుభాకాంక్ష‌లు.. !

AAP: ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ (ఆప్‌) పనితీరును సమీక్షించిన తర్వాత ఎన్నికల సంఘం గోవాలో AAPని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 
 

Election Commission recognition of AAP in Goa.. Kejriwal wishes party workers
Author
Hyderabad, First Published Aug 9, 2022, 3:47 PM IST

Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్ తర్వాత గోవాలో ఆమ్ ఆద్మీ (ఆప్) రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తెలిపారు. ఆప్‌కు మరో రాష్ట్రంలో గుర్తింపు వస్తే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక బ్రాండ్ అయిన 'జాతీయ పార్టీ'గా ప్రకటించబడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఎన్నిక‌ల క‌మిష‌న్ అందించిన ప‌త్రాల‌ను షేర్ చేశారు. 

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దాని పనితీరును సమీక్షించిన తర్వాత ఎన్నికల సంఘం గోవాలో AAPని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ & కేటాయింపు) ఆర్డర్‌లోని పారా 6Aలో నిర్దేశించిన షరతులను AAP నెరవేర్చిందని పోల్ బాడీ పేర్కొంది. "తదనుగుణంగా, ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ & కేటాయింపు) ఆర్డర్, 1968లోని నిబంధనల ప్రకారం గోవా రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర పార్టీగా కమిషన్ గుర్తింపు ఇచ్చింది" అని ఎన్నికల సంఘం తెలిపింది. గోవాలో పార్టీకి గుర్తింపు రావ‌డంపై కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను అభినందించారు. ఆప్, దాని సిద్ధాంతాలపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

గోవా ఎన్నికల్లో ఆప్‌ రెండు స్థానాలతో పాటు 6.77 శాతం ఓట్లను గెలుచుకుంది. పంజాబ్‌లో పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దేశ రాజధాని వెలుపల తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార కాంగ్రెస్‌ను పటిష్ట పద్ధతిలో పడగొట్టింది. ఈ ఏడాది చివర్లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా AAP తన విస్త‌రించాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాలో వ‌రుస ర్యాలీలు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ.. అక్క‌డి ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ ప్ర‌జ‌ల్లో దూసుకెళ్తోంది. 

ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ కి కూడా  ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాగైన విజయం సాధించాలని ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ వరుస పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై విమర్శల వర్షం కురుపిస్తున్నారు. అలాగే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పైన కూడా తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల నుంచి మంచి స్పందనలు రాబడుతోంది. ఎన్నికల సమయం వరకు ఆప్ ఇలానే ప్రజల్లోకి వెళ్తూ.. ఓట్లు రాబట్టాలని చూస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios