మాస్టర్ స్ట్రోక్ .. బాల్ థాకరే పేరిట 700 క్లినిక్లను తెరవనున్న షిండే ప్రభుత్వం
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని షిండే ప్రభుత్వం ఆప్లా దవాఖానా పథకాన్ని ప్రవేశపెట్టింది. దసరా ర్యాలీకి ఒకరోజు ముందు షిండే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే పేరిట 700 'ఆప్లా దవాఖానా' (హెల్త్ క్లినిక్లు)ను ప్రారంభించాలాని భావిస్తోంది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ల తరహాలో ఇవి పని చేస్తాయి. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. అందువల్ల, ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెట్టింపు అవుతుంది. ఆప్లా డిస్పెన్సరీని ప్రారంభించిన ఉద్దేశ్యం ప్రజలకు మెరుగైనఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకరావడమే.
రాష్ట్రంలో ఇటువంటి 700 క్లినిక్లు ప్రారంభించబడతాయి. ముంబైలోనే 227 అటువంటి క్లినిక్లు ఉంటాయి, వాటిలో 50 అక్టోబర్ 2 నుండి పనిచేయడం ప్రారంభించాయి. దీంతో పాటు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు తెరవాలని నిర్ణయించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మెరుగైన వైద్యం పొందేందుకు వీలవుతుందని సీఎం షిండే అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తగిన సంఖ్యలో వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని నియమించనున్నారు.
దసరాకి ముందు షిండే మాస్టర్స్ట్రోక్
దసరాకి ముందు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని షిండే ప్రభుత్వం యొక్క ఆప్లా దవాఖానా పథకం ఒక మాస్టర్ స్ట్రోక్గా పరిగణించబడుతోంది. దసరాకి ఒకరోజు ముందు షిండే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
ఈసారి శివసేన రెండు శిబిరాలు (ఉద్ధవ్ వర్గం మరియు షిండే వర్గం) నిర్వహించనున్నది. ఇందుకోసం సన్నాహాలు జరిగాయి. సంప్రదాయ శివాజీ పార్కులో ఉద్ధవ్ వర్గం ర్యాలీ నిర్వహించనుంది. అదే సమయంలో షిండే వర్గం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మాతోశ్రీ సమీపంలోని MMRDA మైదానంలో దసరా వేడుకలు నిర్వహించనున్నారు. షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మొదటి దసరా ర్యాలీలో ప్రసంగించనున్నారు.
ఇదిలాఉంటే.. ముంబైలో దసరా ర్యాలీ కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన మద్దతుదారులతో వెళ్తున్న మూడు కార్లు బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా మంగళవారం ఔరంగాబాద్ సమీపంలోని హైవేపై ఢీకొన్నాయి. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. విశేషం ఏమిటంటే.. ముంబైకి 323 కిలోమీటర్ల దూరంలోని దౌల్తాబాద్లో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే ఢీకొనడంతో ఒక కారు మరింత ధ్వంసమైంది.
సాయంత్రం 6 గంటల సమయంలో బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా కారును ముందుగా ఎస్యూవీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత అతని వెనుకే వస్తున్న మరో కారు ఎస్యూవీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు మద్దతుదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.