ఎన్‌సీపీ  నేత   జయంత్ పాటిల్ కు  ఈడీ నోటీసులు  జారీ చేసింది.  రేపు విచారణకు  రావాలని ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు ఆ పార్టీ నేత జయంత్ పాటిల్ కు ఈడీ అధికారులు గురువారంనాడు నోటీసులు పంపారు. జయంత్ పాటిల్ ఎన్‌సీపీ మహరాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రేపు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఐఎల్, ఎఫ్ఎస్ స్కాంలో జయంత్ పాటిల్ పై ఆరోపణలున్నాయి. దీంతో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. కోహినూర్ నిర్మాణానికి ఇచ్చిన రుణాలపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ థాకరేను కూడా ఈడీ ప్రశ్నించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred