Enforcement Directorate (ED): జమ్మూకాశ్మీర్ బ్యాంక్ కుంభకోణం కేసుకు సంబంధించి జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. ఈ కేసులో నకిలీ రుణాల ద్వారా మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నిహాల్ గార్వారే అరెస్టయ్యారు.
Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్ బ్యాంక్ కుంభకోణం కేసుకు సంబంధించి జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రశ్నింస్తోంది. ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ ను విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో అబ్దుల్లాకు ఈడీ న్యూఢిల్లీలోని కార్యాలయానికి రావాలని సమన్లు పంపింది. ఈ కేసులో నకిలీ రుణాల ద్వారా మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నిహాల్ గార్వారే అరెస్టయ్యారు.
జమ్మూకాశ్మీర్ బ్యాంకు కుంభకోనం కేసు ఏంటి?
జమ్మూకాశ్మీర్ బ్యాంకులో అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచరణలో గుర్తించారు. అక్రమ లావాదేవీలు, సరిపోలని డాక్యుమెంట్లతో ఖాతాల్లో కొన్ని నుంచి అనధికార ఖాతాలకు డబ్బులు బదిలీ అయినట్లు తేలింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో J&K బ్యాంక్ని ఉపయోగించడం కోసం విక్రేతకు అనవసర ప్రయోజనాలను అందించడానికి చాలా ఎక్కువ ధరకు ఆస్తిని కొనుగోలు చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ముంబైలోని జమ్మూకాశ్మీర్ బ్యాంక్లో బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం తగినంత స్థలం అందుబాటులో ఉన్నందున మరియు సేల్ డీడ్ను సులభతరం చేయడానికి క్విడ్ ప్రోకో ఆరోపణలు ఉన్నందున ఆస్తి అవసరం లేదని ఆరోపించారు.
2010లో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లోని అకృతి గోల్డ్ బిల్డర్స్ నుండి ఆస్తిని కొనుగోలు చేసినందుకు J&K బ్యాంక్ అప్పటి మేనేజ్మెంట్పై CBI ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ముంబయిలోని బాంద్రా కుర్లాలోని M/s ఆకృతి గోల్డ్ బిల్డర్స్ నుండి 180 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేయడంలో.. టెండర్ ప్రక్రియను పూర్తిగా విస్మరించినందుకు CBI ఈ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు ప్రారంభించగా.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. జేఅండ్కే బ్యాంక్ స్కామ్ డిఫాల్ట్ చేసిన సంస్థలకు పూచీకత్తు లేకుండా భారీ రుణాలు ఇవ్వడం, ఇద్దరు మాజీ చైర్పర్సన్లు ఇప్పటికే రాజకీయ నేతలతో కుమ్మక్కై బ్యాంకులో కీలక స్థానాల్లో వ్యక్తులను రుణాల మంజూరు కోసం నియమించారని ఆరోపణలు వచ్చాయి.
ఒమర్ అబ్దుల్లా సన్నిహితులంటూ..
సంబంధిత దర్యాప్తు వర్గాల ప్రకారం.. ముంబయికి చెందిన బ్యాంక్ డైరెక్టర్ నిహాల్ చంద్రకాంత్ గార్వేర్ ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఆస్తి ఒప్పందం ద్వారా బ్యాంకు నుండి కోట్లాది రూపాయలను స్వాహా చేశారని ఆరోపించారు. గార్వేర్ను ఇటీవల అరెస్టు చేశారు. ఒమర్ అబ్దుల్లా నిహాల్ గార్వేర్తో సన్నిహితంగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అతను ఈ డీల్లో పాల్గొన్నాడో లేదో తెలుసుకోవడానికి.. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకురాడానికి ఈడీ దర్యాప్తు జరుపుతోంది. J&K బ్యాంక్ డైరెక్టర్లు బోగస్ రుణాల ద్వారా భారీ మొత్తంలో నిధులను మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీల డబ్బును రూట్ చేయడానికి అనేక బ్యాంకు ఖాతాలు ఉపయోగించబడుతున్నాయి. బ్యాంక్ అధికారులు, ఈ పబ్లిక్ సర్వెంట్లతో సహకరించి, మనీలాండరింగ్ నిరోధక (AML) నిబంధనల ప్రకారం అవసరమైన హెచ్చరికలను పెంచడానికి ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ED తెలిపింది.
