Economic Survey 2025 Highlights: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంరోజే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వేలోని కీలక అంశాాలివే..
Economic Survey 2025 key points: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (జనవరి 31, శుక్రవారం) పార్లమెంటులో 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP (Gross Domestic Product) వృద్ధి 6.3% నుండి 6.8% వరకు ఉండవచ్చని ఈ సర్వే తేల్చింది.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం ఒకటి నుండి రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి అవసరమని సర్వే అంచనా వేసింది.
ఇంకా ఈ సర్వేలో దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అనేక విషయాలను పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం మౌళిసదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో 5,853 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇలా దేశ అభివృద్ది కోసం మోదీ సర్కార్ భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఆర్ధిక సర్వే ద్వారా ప్రజలకు తెలియజేసారు.
ఆర్థిక సర్వేలోని 10 కీలక అంశాలు ఇవే.
1. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి వృద్ధి 6.3% నుండి 6.8% వరకు ఉండవచ్చు.
2. ఆర్థిక సర్వే GST వసూళ్లలో 11% వృద్ధిని అంచనా వేసింది, ఇది 10.62 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది.
3. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రీటైల్ ద్రవ్యోల్బణం 5.4%గా ఉంది, ఇది ఏప్రిల్-డిసెంబర్ 2024లో 4.9%కి తగ్గింది.
4. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి అవసరమని సర్వే పేర్కొంది.
5. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సేవా రంగం 7.1% వృద్ధిని నమోదు చేసింది. జూలై-నవంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 8.2% పెరిగింది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
6. 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో మంచి రబీ దిగుబడి కారణంగా ఆహార ధరలు నియంత్రణలో ఉంటాయని అంచనా.
7. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి తగ్గిన కారణంగా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి ఆహార ధరలు పెరిగాయి. అయితే 2024-2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు.
8. గత 7 సంవత్సరాలలో కార్మిక మార్కెట్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 3.2%కి తగ్గింది.
9. విదేశీ పెట్టుబడులను పెంచడానికి భారతదేశం అన్ని చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలి.
10. భవిష్యత్తులో యువత మానసిక ఆరోగ్యమే ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది.