బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీఎస్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక, నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. నేపాల్‌లో సోమవారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రభావంతో ఢిల్లీలో కూడా ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ) తెలిపింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలు కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలకు లోనయ్యాయని పేర్కొంది.

Scroll to load tweet…