భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఢిల్లీ: ఈశాన్య భారత్లో మంగళవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అసోంలలో అర్థరాత్రి భూకంపం సంభవించింది.
భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే ఈశాన్య భారత్ లో భూకంపం ధాటికి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ కు సరిహద్దులో ఉన్న మయన్మార్, భూటాన్ లలో కూడా భూమి కంపించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 24, 2019, 8:52 AM IST