Earthquake: శుక్రవారం రాత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీ, ఎన్సీఆర్‌లో బలమైన భూ ప్ర‌కంప‌న‌లు సంభవించాయి. అయితే, ఈ  భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఆస్థి, ప్రాణ‌న‌ష్టం గురించి ఇంకా ఎలాంటి పూర్తి స‌మాచారం అంద‌లేని స్థానిక‌ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంప ప్రభావం నేపాల్ తో పాటు భారత్, చైనాలో కనిపించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Earthquake tremors jolt Delhi: శుక్రవారం రాత్రి నేపాల్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని ప్ర‌భావంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీ ఒక్క‌సారిగా భూ ప్రకంపనలతో వ‌ణికిపోయింది. వివరాల్లోకెళ్తే.. శుక్ర‌వారం రాత్రి 11.32 గంట‌ల‌కు ఢిల్లీ, ఎన్సీఆర్ ప‌రిధితో బ‌ల‌మైన భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. భూకంప కేంద్ర వద్ద రిక్ట‌ర్ స్కేల్ పై 6.4 తీవ్ర‌త న‌మోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, రాత్రి 11:32 గంటలకు 10 కిలో మీట‌ర్ల లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృత‌మైంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లో శక్తివంతమైన భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఈ ప్రాంతం అంతటా షాక్‌వేవ్‌లను చ‌విచూసింది. నివాసితులను భయాందోళనకు గురిచేసింది. సుమారు రాత్రి 11:32 గంటలకు సంభవించిన భూకంపం, ఎన్సీఆర్ లోని ప్రముఖ నగరాలు నోయిడా, ఘజియాబాద్‌లో బలమైన ప్రకంపనలకు కారణమైంది.

భూకంపం ఖచ్చితమైన పరిమాణాన్ని ఇంకా అంచనా వేయబడుతున్నప్పటికీ, ప్రాథమిక నివేదికలు ఇది ఒక ముఖ్యమైన సంఘటన అని సూచిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు భూ ప్రకంపనలను నివేదించారు. దీంతో చాలా మంది ఆరుబయటకు పరుగులు తీశారు. అయితే, ప్ర‌కంప‌న‌ల ప్ర‌భావం భూకంప కేంద్ర న‌మోదైన ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్ర‌త న‌మ‌దైంది. తాజాగా సంభవించిన ఈ భూకంప ప్రభావం నేపాల్ తో పాటు భారత్, చైనాలో కనిపించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

Scroll to load tweet…