Dry Day: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి 22.. ఈ రాష్ట్రాల్లో డ్రై డే
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ రోజు మందిరం గర్భగుడిలో రామ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఈ రోజున డ్రై డే పాటించాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.
![dry day on january 22 in these states as ayodhya ram temple consecration ceremony held kms dry day on january 22 in these states as ayodhya ram temple consecration ceremony held kms](https://static-ai.asianetnews.com/images/01hka4w5fsczb58nr26nrre5a5/web-story--4-_363x203xt.jpg)
Ram Temple: ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ రోజు పవిత్రంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు ఎన్డీయే పాలిత రాష్ట్రాలు డ్రై డేను ప్రకటించాయి.
ఛత్తీస్గఢ్: అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తున్న జనవరి 22వ తేదీన సీఎం విష్ణు దేవ్ సాయి రాష్ట్రంలో డ్రై డే ప్రకటించారు. జనవరి 22న డ్రై డే ప్రకటించిన తొలి రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఈ నిర్ణయాన్ని గత వారమే ప్రకరటించారు.
అసోం: ఛత్తీస్గఢ్ నిర్ణయాన్నే అసోం కూడా ఫాలో అయింది. జనవరి 22న డ్రై డే పాటించాలని టూరిజం మంత్రి జయంత్ మల్ల బారువా ప్రకటించారు.
యూపీ: జనవరి 22న జరిగే కార్యక్రమం యూపీలోని అయోధ్యలోనే. ఈ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా జనవరి 22న మందు లభించదని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : Bangles: ఒక్క కొడుకు ఉన్నవారికి ఇద్దరు కొడుకులున్నవారు గాజులు వేయాలా? పండితులు ఏమంటున్నారు?
వీటితోపాటు.. !
వీటితోపాటు మహారాష్ట్ర, రాజస్తాన్లోనూ డ్రై డే పాటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ రాష్ట్రాల్లో కూడా జనవరి 22న డ్రై డే పాటించాలనే ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామంగా మారింది.