Asianet News TeluguAsianet News Telugu

ప్రాణం కాపాడేందుకు రైలు వెనక్కి వచ్చింది

ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కిలోమీటరు దూరం రైలును వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
 

driver saves life in rajasthan to reverse train for one kilometer
Author
Jaipur, First Published Apr 28, 2019, 5:25 PM IST

జైపూర్: ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కిలోమీటరు దూరం రైలును వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

రాజస్థాన్ రాష్ట్రంలోని  అట్రూ- సల్పూరా రైల్వే లైన్ మీదుగా ఓ రైలు వెళ్తోంది. మతి స్థిమితం లేని రాజేంద్ర వర్మ అనే ప్రయాణీకుడు రైలులో ఉంచి కిందకు దూకాడు. వర్మను కాపాడే క్రమంలో అతని సోదరుడు వినోద్‌ కూడ రైలులోంచి దూకాడు. ఈ ఘటనలో  వర్మకు తీవ్ర గాయాలైతే, వినోద్ కు చిన్నపాటి గాయాలయ్యాయి.

ఇదే రైలులో వీరి బందువు సరేశ్ వర్మ కూడ  ప్రయాణం చేస్తున్నాడు.  అతను చైన్ లాగాడు. అంబులెన్స్‌కు ప్రయాణీకులు ఫోన్ చేశారు. అయితే ఆ ప్రాంతానికి అంబులెన్స్ వచ్చే దారి లేదు.

దీంతో కిలోమీటరు దూరం రైలును తీసుకెళ్లి అక్కడి నుండి రాజేంద్రను ఆసుపత్రికి వైద్య సిబ్బంది ఫోన్‌లో చెప్పారు. ఈ విషయాన్ని రైలు డ్రైవర్ కు చెప్పారు. దీంతో డ్రైవర్ రైలును కిలోమీటరు దూరం వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడి నుండి రాజేంద్రను అంబులెన్స్‌లో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios