NITI Aayog meet: ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఆదివారం నాడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ స‌మావేశం జ‌రిగింది. దీనికి వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. 

West Bengal Chief Minister Mamata Banerjee: రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్‌లను కేంద్రం మరింత సీరియస్‌గా పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం ఉద్ఘాటించారు. కేంద్ర విధానాల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడిని తీసుకువ‌స్తూ.. వాటిని బ‌ల‌వంతంగా రుద్ద‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌హ‌కారం ఉంటేనే మెరుగైన అభివృద్ధి జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఆదివారం నాడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ స‌మావేశం జ‌రిగింది. దీనికి వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఈ స‌మావేశానికి విచ్చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మ‌మ‌తా బెనర్జీ ప్రసంగిస్తూ.. కేంద్రం, రాష్ట్రాల మధ్య గొప్ప సహకారం ఉండాలని ఉద్ఘాటించారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయరాదని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం NEPని అమలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇది NEPని పరిశీలించడానికి, విద్యపై రాష్ట్ర-స్థాయి విధానం అవసరాన్ని అంచనా వేయడానికి ఏప్రిల్‌లో 10 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సహకారం ఉండాలని పేర్కొన్న మ‌మ‌తా బెనర్జీ.. నీతి ఆయోగ్ స‌మావేశంలో సుమారు 15 నిమిషాలపాటు ప్రసంగించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ మొదటి భౌతిక సమావేశం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 2021 సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. ఈ సమావేశానికి 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. గవర్నింగ్ కౌన్సిల్ నాలుగు కీలక ఎజెండా అంశాలను చర్చించింది. వాటిలో పంటల వైవిధ్యం, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించడం; పాఠశాల విద్యలో జాతీయ విద్యా విధానం అమలు; ఉన్నత విద్యలో NEP అమలు; పట్టణ పాలనలు ఉన్నాయి. 

కాగా, కోల్‌కతాలో తుపాను పరిస్థితిని ఉటంకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నుండి మధ్యలోనే నిష్క్రమించారు. విమానాశ్రయానికి వెళ్లే ముందు, మమతా బెనర్జీ MGNREGA పథకం, కొన్ని నిత్యావసరాలపై వస్తు, సేవల పన్ను (GST) పెంపు గురించి తన అంశాలను తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాంగణం నుండి బయలుదేరి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆమె కారు కనిపించింది. మమతా బెనర్జీ నిష్క్రమణకు ముందు జరిగిన మేధోమథన సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజరయ్యారు.

Scroll to load tweet…