Asianet News TeluguAsianet News Telugu

డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం: డ్రైవర్‌ను చంపి 100 ముక్కలుగా కోసిన డాక్టర్

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ను అత్యంత దారుణంగా చంపి, అనంతరం అతని మృతదేహాన్ని 100 ముక్కలుగా కోశాడు ఓ వైద్యుడు . వివరాల్లోకి వెళితే.. హోసంగాబాద్ పట్టణంలోని ఆనంద్‌ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సునీల్ మంత్రి వద్ద వీరేంద్ర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

doctor chops his driver dead body into pieces after killing
Author
Hoshangabad, First Published Feb 6, 2019, 1:53 PM IST

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ను అత్యంత దారుణంగా చంపి, అనంతరం అతని మృతదేహాన్ని 100 ముక్కలుగా కోశాడు ఓ వైద్యుడు . వివరాల్లోకి వెళితే.. హోసంగాబాద్ పట్టణంలోని ఆనంద్‌ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సునీల్ మంత్రి వద్ద వీరేంద్ర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

వైద్యుని కొడుకు, కూతురు ముంబైలో నివాసం ఉంటున్నారు. డాక్టర్ భార్యతో పాటు వీరేంద్ర భార్య కలిసి బొటికే నిర్వహించేవారు. ఈ క్రమంలో వైద్యుని భార్య మరణించడంతో డ్రైవర్ భార్య దానిని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తరచూ వైద్యునితో మాట్లాడుతుండటంతో డాక్టర్‌కు వీరేంద్ర భార్యతో మంచి సన్నిహిత్యం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భార్యతో సంబంధం గురించి వీరేంద్రకు తెలిసిపోవడంతో అతను డాక్టర్‌ను డబ్బు కోసం బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీనిని భరించలేకపోయిన డాక్టర్ వీరేంద్రను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా 100 లీటర్ల యాసిడ్‌ను, పదునైన కత్తులను తెప్పించాడు.

ఈ క్రమంలో సోమవారం పంటినొప్పిగా ఉందని చెప్పడంతో దీనిని అవకాశంగా భావించిన వైద్యుడు.. తాను చూస్తానని చెప్పి.. బెడ్‌పై పడుకోబెట్టి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. అనంతరం ఆపరేషన్ చేసే కత్తితో గొంతు కోశాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు గాను డ్రైవర్ శవాన్ని రంపాలతో 100 ముక్కలుగా కోసి, అప్పటికే సిద్ధంగా ఉంచిన యాసిడ్ డ్రమ్ములో వేసి మూతపెట్టాడు.

అయితే ఈ ప్రక్రియలో భాగంగా అతను బాల్కనీ‌ వద్దకు పదే పదే రావడం చెమట పట్టడం, డాక్టర్‌ ఒంటికి రక్తపు మరకలు ఉండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నాడు.

వీరేంద్ర మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి అతను సుమారు మూడు గంటల పాటు బాత్‌రూమ్‌లోనే గడిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యాసిడ్ డ్రమ్మును, వీరేంద్ర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వీరేంద్ర భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios