Asianet News TeluguAsianet News Telugu

‘ధూమ్-4 Coming Soon’.. సినీ ఫక్కీలో చోరీ.. బ్లాక్ బోర్డుపై ఫోన్ నెంబర్లు రాసి మరీ దొంగతనం

ఒడిశాలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఓ దొంగల ముఠా స్కూల్‌లో చొరబడి కంప్యూటర్లు, జిరాక్స్ మెషీనన్, ప్రింటర్, వెయింగ్ మెషీన్ సహా పలు వస్తువులను వారు దొంగిలించారు. వీటిని దొంగిలించిన చోరులు.. అక్కడే బ్లాక్ బోర్డుపై ధూమ్ -4 కమింగ్ సూన్ అని రాశారు. అంతేకాదు.. చేతైనేత పట్టుకోండని ఫోన్ నెంబర్లు రాశారు.

dhoom style robbery occured in odishas schools.. even thieves write phone numbers on blackboard
Author
Bhubaneswar, First Published Jul 4, 2022, 2:32 PM IST

భువనేశ్వర్: బాలీవుడ్ సినిమా ధూమ్ సిరీస్ తెలుసు కదా..! అందులో లీడ్ రోల్స్ పోలీసు అధికారులకు చెప్పి మరీ చోరీ చేస్తారు. వారి కళ్లుగప్పి వారి సమక్షంలోనే దొంగతనం చేసి ప్రేక్షకులను రంజింపచేయడమే ఆ సిరీస్‌లో కీలక అంశం. అయితే.. అదంతా సినిమా. నిజ జీవితం వేరు. కానీ, ఒడిశాలో మాత్రం ధూమ్ సినిమా ప్రేరణతో ఓ ముఠా దొంగతనం చేసినట్టుగా కనిపిస్తున్నది.

‘ధూమ్-4 coming soon. ధూమ్-4 will return. మీకు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి. మా మొబైల్ నెంబర్లు ఇవిగో.. ’ ఇదంతా ధూమ్ మూవీ సిరీస్ గురించి ప్రమోషన్ అనుకుంటున్నారా? అయితే.. తప్పులో కాలేసినట్టే. ఓ స్కూల్‌లో చోరీ చేసి ఆ ఆకతాయి దొంగలు బ్లాక్ బోర్డులపై రాసిన వాక్యాలు అవి.

వారికి అతివిశ్వాసమో లేక పోలీసులను తప్పుదారి పట్టించాలనే ఆలోచనలో కానీ.. ఈ రాతలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఘటన ఒడిశా జిల్లాలోని నబరంగ్ పూర్ జిల్లాలో ఆదివారం అంటే జులై 3వ తేదీన చోటుచేసుకుంది.

నబరంగ్ పూర్ జిల్లాలోని ఇంద్రావతి హై స్కూల్‌లో దొంగలు పడ్డారు. హెడ్ మాస్టర్ గది తలుపులూ పగులపొట్టారు. ఆ స్కూల్‌లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫొటోకాపీయర్స్, వెయింగ్ మెషీన్, ఓ సౌండ్ బాక్స్‌ను దొంగలు పట్టుకెళ్లారు. 

ఈ చోరీ జరిగిన మరుసటి రోజు ఉదయం స్కూల్ ప్యూన్ ఎప్పట్లాగే పాఠశాలకు వెళ్లాడు. బడిలో అడుగు పెట్టగానే హెడ్ మాస్టర్ రూమ్ తలుపులు ధ్వంసం చేసి కనిపించాయి. స్కూల్‌లోని దాదాపు మొత్తం ఆఫీసు ఎక్విప్‌మెంట్ చోరీ అయిందని గ్రహించాడు. వెంటనే ఆ ప్యూన్ స్కూల్ అధికారులకు విషయం తెలిపారు. ఆ స్కూల్‌లోని బ్లాక్ బోర్డుపై ధూమ్-4 త్వరలో వస్తున్నాడు.. ధూమ్-4 మళ్లీ వస్తాడు.. మీకు చేతనైతే మమ్మల్ని వెతికి పట్టుకోండి అని రాతలు కనిపించాయి. అంతేకాదు, ఓ బ్లాక్ బోర్డుపై కొన్ని మొబైల్ నెంబర్లు కూడా రాసి వెళ్లారు. 

ఈ ఘటనపై నబరంగ్ పూర్ ఎస్పీ సుశ్రీ ఎస్ మాట్లాడుతూ, కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఇంద్రావతి హై స్కూల్ హెడ్‌మాస్టర్ సర్బేశ్వర్ బెహెరాల ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్పీ తెలిపారు.

ఓ పోలీసు బృందం, సైంటిఫిక్ స్క్వాడ్, స్నిఫరర్ డాగ్‌ను వెంటబెట్టుకుని స్పాట్ చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios