'సనాతన బోర్డ్' ఏర్పాటు చేయాల్సిందే..: దేవకినందన్ ఠాకూర్

దేవకినందన్ ఠాకూర్ మహాకుంభ్ 2025 ఏర్పాట్లను ప్రశంసించారు, 'సనాతన బోర్డ్' ఏర్పాటు అవసరం అన్నారు. దేవాలయాల ఆస్తుల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసి, సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపునిచ్చారు.

Devki Nandan Thakur praises Prayagraj Mahakumbh 2025 preparations advocates Sanatan Board AKP

మహాకుంభ్ నగర్ : ప్రముఖ కథావాచకులు దేవకినందన్ ఠాకూర్ మహాకుంభ్ 2025 కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో చేపట్టిన ఏర్పాట్లను ప్రశంసించారు. రోడ్లు, నీరు, ఇతర వసతులను చక్కగా ఏర్పాటు చేసి ఈ మహా పర్వాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అద్భుతమైన కృషి చేసిందని అన్నారు. ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రిని ఠాకూర్ అభినందించారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సనాతన ధర్మానికి అనుకూలం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సనాతన ధర్మానికి అనుకూలమైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని దేవకినందన్ ఠాకూర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ సనాతన ధర్మ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వ పాలన రాష్ట్రానికి, దేశానికి చాలా మేలు చేస్తుందని అన్నారు.

 జనవరి 27న జరగనున్న 'సనాతన ధర్మ పార్లమెంట్' గురించి ప్రకటిస్తూ, దాని ముఖ్య ఉద్దేశ్యాన్ని ఠాకూర్ వివరించారు. 'సనాతన బోర్డ్' ఏర్పాటు ఈ పార్లమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ బోర్డ్ ద్వారా మత మార్పిడులను అరికట్టడం, దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం, ధార్మిక సంస్థలను సక్రమంగా వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు.
 
ప్రస్తుతం దేవాలయాల నిధులను సనాతన ధర్మానికి విరుద్ధమైన పనులకు వాడుతున్నారని దేవకినందన్ ఠాకూర్ అన్నారు. ఈ డబ్బుతో హజ్ యాత్రలు, చర్చిల నిర్మాణం చేపడుతున్నారని, గురుకులాలు, గోశాలలు, ఆసుపత్రులు, నిరాశ్రితుల సంక్షేమానికి వినియోగించాలని అన్నారు. 'సనాతన బోర్డ్' ఏర్పడితే ఈ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపు

సనాతన ధర్మ పరిరక్షణ, అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని దేవకినందన్ ఠాకూర్ నొక్కి చెప్పారు. మనం అడవట్లేదు కాబట్టి మనకు దక్కట్లేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ మాట విని సనాతన ధర్మ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios