వారణాసిలో దేవ్ దీపావళి సందర్భంగా 21 లక్షల దీపాలతో గంగానది తీరాలు వెలిగిపోయాయి. గంగా హారతి, లేజర్ షో, గ్రీన్ బాణసంచాతో అద్భుతమైన వేడుకలు జరిగాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ నమో ఘాట్‌ను ప్రారంభించారు.

వారణాసి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దేవ్ దీపావళిని భారీ ఎత్తున వైభవంగా జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కొత్త ఉత్సాహంతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం, కాశీలోని 84 ఘాట్‌లపై దాదాపు 21 లక్షల దీపాలు వెలిగించి, గంగానది తీరాలను దివ్య కాంతులతో ప్రకాశవంతం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

YouTube వీడియో ప్లేయర్

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ వారణాసికి

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కాశీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన 'నమో ఘాట్'ను ప్రారంభించారు. గంగా నది ఒడ్డున దీపాలతో పాటు గంగా హారతి, లేజర్ షో, గ్రీన్ బాణసంచాతో అద్భుతమైన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.

ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి లక్షలాది మంది పర్యాటకులు

దేవ్ దీపావళి సందర్భంగా వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు వారణాసికి వచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి కాశీ సంస్కృతిని అనుభవించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు హాజరయ్యారు. నమో ఘాట్ ప్రారంభోత్సవాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ చేతుల మీదుగా జరిగింది.