Asianet News TeluguAsianet News Telugu

దళితుడి మృతదేహన్ని ఇలా తరలించారు

తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు.

Denied access to crematorium Tamil Nadu dalits airdrop dead
Author
Vellore, First Published Aug 22, 2019, 5:41 PM IST

వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు. అగ్రవర్ణాలకు చెందిన పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లకుండా అంగీకరించకపోవడంతో ఇలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. వన్నియంబాడికి సమీపంలోని నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఓ దళిత వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతదేహన్ని  స్మశానవాటికకు తరలించాలంటే ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన పొలాల నుండి  తరలించాల్సి ఉంది. అయితే  ఈ విషయమై  అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అడ్డుచెప్పారు. దీంతో సమీపంలోని 20 అడుగుల ఎత్తు నుండి మృతదేహన్ని తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios