తనపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని చంపిన మహిళ.. ఇద్దరు అరెస్టు, వెలుగులోకి కీలక విషయాలు
New Delhi: పలుమార్లు అత్యాచారానికి గురైన ఒక మహిళ నిందితులను చంపేందుకు తన స్నేహితుల సహాయం తీసుకుంది. తనపై లైంగికదాడి చేసిన వారిని చంపింది. మృతుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడనీ, భర్త చనిపోయిన తర్వాత లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తనపై అత్యాచారం చేస్తున్న వారి నుంచి స్వేచ్ఛతో పాటు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ నేరం చేసినట్టు పోలీసులకు తెలిపింది.

Delhi Police: పలుమార్లు అత్యాచారానికి గురైన ఒక మహిళ నిందితులను చంపేందుకు తన స్నేహితుల సహాయం తీసుకుంది. తనపై లైంగికదాడి చేసిన వారిని చంపింది. మృతుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడనీ, భర్త చనిపోయిన తర్వాత లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తనపై అత్యాచారం చేస్తున్న వారి నుంచి స్వేచ్ఛతో పాటు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ నేరం చేసినట్టు పోలీసులకు తెలిపింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో 20 ఏళ్ల యువకుడిని హత్య చేసిన కేసులో ఓ మహిళ సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ, ప్రతీకారం తీర్చుకునేందుకే చంపేశానని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న ఇర్ఫాన్.. మహిళ భర్త సన్నిహితుడిగా గుర్తించారు. నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నదిని చూసేందుకు బాధితురాలిని బేలా ఫామ్ సమీపంలోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లగా, అక్కడ తన పురుష మిత్రుడి సహాయంతో అతడిని అడ్డగించి అక్కడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 8.34 గంటల సమయంలో శాస్త్రి పార్క్ ప్రాంతంలోని బేలా ఫామ్ లో మెడ, పొత్తికడుపుపై గాయాలతో కూడిన షర్ట్ లెస్ మృతదేహం కనిపించింది. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ కు చెందిన 20 ఏళ్ల యువతి, శాస్త్రి పార్కుకు చెందిన ఇర్ఫాన్ (36)గా గుర్తించారు. అనంతరం వారిని పట్టుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు.
కాగా, సదరు మహిళ భర్త జనవరిలో మరణించినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మృతుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ, తన భర్త చనిపోయిన తర్వాత లైంగిక వేధింపులు పెరిగాయని బాధితురాలు పోలీసులకు తెలిపింది. మృతురాలి నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని, స్వేచ్ఛ కావాలని కోరుకుందని డీసీపీ తెలిపారు. ఇర్పాన్ మహిళ భర్త సన్నిహితులు కాగా, ఆమెను వేధించిన వ్యక్తిని అంతమొందించడానికి సహాయం చేయడానికి అంగీకరించినట్టు పోలీసు అధికారి తెలిపారు. ఉప్పొంగుతున్న యమునా నదిని చూసేందుకు బాధితురాలిని బేలా ఫామ్ సమీపంలోని ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె, ఇర్ఫాన్ కలిసి అతడిని అడ్డగించి కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని పొలంలో గోడ వెనుక పడేశారని తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలో నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.