కొత్త ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్
Delhi: కొత్త ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియమితులయ్యారు. 1985 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ ఒక రోజుముందు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
Election Commissioner Arun Goel: మాజీ పంజాబ్ క్యాడర్ అధికారి సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఒక రోజు తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ను ఎన్నికల కమిషనర్గా నియమించారు.
వివరాల్లోకెళ్తే.. మాజీ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ శనివారం ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఆయన నియామకం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. అరుణ్ గోయల్ 1985 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో కలిసి పోల్ ప్యానెల్లో చేరనున్నారు.
మాజీ పంజాబ్ క్యాడర్ అధికారి అయిన అరుణ్ గోయల్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఒక రోజు తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను ఎన్నికల కమిషనర్గా నియమించారు. ఒక ప్రకటనలో "అరుణ్ గోయల్, IAS (రిటైర్డ్.) (PB: 1985)ని ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్గా నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు, ఇది ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అమలులోకి వస్తుంది" పేర్కొన్నారు.
ముగ్గురు సభ్యుల జాతీయ ఎన్నికల కమిషన్లో ఒక ఎన్నికల కమిషనర్ పదవి మే 15 నుండి ఖాళీగా ఉంది. అప్పటి ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ పదవి నుండి సుశీల్ చంద్ర పదవీ విరమణ చేసిన తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, అరుణ్ గోయల్ శుక్రవారం వరకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అతను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, అతని స్థానంలో ఉత్తరప్రదేశ్ క్యాడర్ అధికారి కమ్రాన్ రిజ్వీని నియమించినట్టు కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఆయన డిసెంబరు 31న పదవీ విరమణ పొందాలని ముందుగా భావించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అరుణ్ గోయల్ స్వస్థలం పాటియాలా..
అరుణ్ గోయల్ పాటియాలాకు చెందినవారు. ఆయన తండ్రి పంజాబీ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్. గోయల్ మొదటి నుండి చదువులో చాలా తెలివైనవాడు. పాటియాలాలోని కాలేజీలో బీఏలో టాపర్. ఐఏఎస్ అయిన తర్వాత, గోయల్ పంజాబ్, కేంద్రంలోని వివిధ శాఖల్లో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఆయన ఖరార్ (పంజాబ్) నుండి మొదట తన సర్వీసును ప్రారంభించారు. ఖరార్లో SDMగా నియమించబడ్డాడు. అలాగే, లూథియానాలో డిప్యూటీ కమీషనర్, తరువాత పంజాబ్ స్టేట్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ కార్పోరేషన్ ఎండీగా విధులు నిర్వర్తించారు. నీటిపారుదల, ఇంధనం, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు.