Congress: ఢిల్లీ పోలీసులు మీడియాను అడ్డుకున్నారనీ, ఈ ధోరణి మోడీ ప్రభుత్వ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ ఆరోపించారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్న నేపథ్యంలో దేశ రాజధాని అంతటా నిరసనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మీడియాను రాకుండా ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు 'హైహ్యాండ్నెస్' ప్రదర్శిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇది మోడీ ప్రభుత్వ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
"ఈరోజు (గురువారం) తెల్లవారుజాము నుండి ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రి నుండి స్పష్టంగా ఆదేశాలు అందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ 'హైహ్యాండ్నెస్' వైఖరి ఊహించినదే.. ఇది మోడీ సర్కారు ఆలోచనను ప్రతిబింబిస్తుంది" అని ట్వీట్ చేశాడు.
मीडिया को कांग्रेस कार्यालय में आने से रोका जा रहा है।
किसी भी अन्याय के खिलाफ अहिंसात्मक गांधीवादी ‘सत्याग्रह’ हर भारतीय का संवैधानिक अधिकार है। लेकिन सत्ता के अंहकार में मोदी सरकार यह हक़ भी हमसे छिनने की कोशिश कर रही है। यह कांग्रेस पर नहीं भारत के महान लोकतंत्र पर हमला है।Ad2
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం 24-అక్బర్ రోడ్లో ఉన్నందున పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అలాగే, అక్బర్ రోడ్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు మాణికం ఠాగూర్ ట్వీట్ చేస్తూ "అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ కార్యాలయ ప్రధాన కార్యాలయం ఇప్పుడు షా పోలీసులచే మూసివేయబడింది. వారికి కాంగ్రెస్ కార్యకర్తల బలం.. నిబద్ధత తెలుసు" అంటూ ట్వీట్ చేశారు.
అలాగే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో మరోసారి సమావేశం కానున్నారు. కాగా, గురువారం ఉదయం 11 గంటలకు ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విచారణాధికారుల ముందుకు రావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. COVID-19 కారణంగా సోనియా గాంధీ ఈ కేసులో ED దర్యాప్తులో చేరలేనందున తాజా సమన్లు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తొలిసారిగా జూన్ 8వ తేదీన తమ దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని సోనియా గాంధీకి ఈడీ జూన్ 1న సమన్లు పంపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా గాంధీ వాంగ్మూలాలను నమోదు చేయాలని ఈడీ కోరుతోంది.
ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఈడీ గత నెలలో పలు సందర్భాల్లో ప్రశ్నించింది. దాదాపు 50 గంటలకు పైగా ఆయనను ఈడీ విచారించింది.
