ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు మనీ లాండరింగ్ కేసులో బెయిల్ లభించలేదు. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తిరస్కరించింది. మే 30న సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీలోని స్పెషల్ సీబీఐ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఈ నెల 18న ఆయన బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. 2015-16 కాలంలో కోల్‌కతాకు చెందిన ఓ సంస్థతో హవాలా జరిపారన్న ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రూ. 1.62 కోట్ల సొమ్మును మనీ  లాండరింగ్ చేశారన్న ఆరోపణలతో 2017 ఆగస్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. 2011-12 మధ్యలో రూ. 11.78 కోట్లు, 2015-16 కాలంలో రూ. 4.63 కోట్ల మనీ లాండరింగ్ చేయడానికి సత్యేందర్ జైన్, ఆయన కుటుంబం నిజమైన వ్యాపార కార్యకలాపాలేవీ లేని షెల్ కంపెనీలు స్టార్ట్ చేశారని సీబీఐ ఆరోపిస్తున్నది. 

ఈ ఆరోపణల నేపథ్యంలో మే 30న సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో ఆదాయానికి మించిన ఆస్తుల కింద సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన రూ. 4.81 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల  విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఇటీవల ఆయనను అరెస్టు చేసింది.  జైన్ ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది.  విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని.. ఈడీ కోరగా దాన్ని జూన్ 13 వరకు పొడిగించింది. అనంతరం మరో 14 రోజుల వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో జూన్ 7న సాయంత్రం ఈడీ సోదాలు ముగిసాయి. ఇంట్లో 1.80 కిలోల  బంగారం, రూ.2.85 కోట్ల నగదును ఈడీ  అధికారులు సీజ్ చేశారు. కోల్కతాకు చెందిన  ఒక సంస్థకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈ ఈ నెల 6వ తేదీన ఈడీ సోదరులు ప్రారంభించింది. ఏడవ తేదీ సాయంత్రం ఈడీ సోదాలు ముగిశాయి. ఈడీ అధికారులు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తో పాటు అతడి సహాయకుడి ప్రాంగణంలో ఉంచిన రూ. 2.82 కోట్ల నగదు,  133బంగారు నాణెలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 9వ తేదీ వరకు మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ కస్టడీలో ఉంచాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఆదేశించారు 

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలొ జైన్ ఆరోగ్యం, విద్యుత్, హోం, పీడబ్ల్యూడీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి,  నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు.