ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా బాణాసంచాపై నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఢిల్లీలో ఆన్లైన్లో బాణాసంచా అమ్మకాలు మరియు డెలివరీని నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే జనవరి 1వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం ప్రకటించారు.
అలాగే.. ఆన్లైన్ లో బాణాసంచా విక్రయాలకు సైతం నిషేధం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా, బాణసంచా కాల్చడం వల్ల ఢిల్లీలో కాలుష్య స్థాయి గణనీయంగా పెరుగుతుంది. గతేడాది కూడా ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా పెంచాలని నిర్ణయించారు.
ఈ ఏడాది ఢిల్లీలో ఆన్లైన్లో పటాకుల అమ్మకం / డెలివరీపై నిషేధం ఉంటుందని గోపాల్ రాయ్ ట్వీట్ చేశారు. ఈ నిషేధం జనవరి 1, 2023 వరకు అమలులో ఉంటుందనీ, నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, డీపీసీసీ, రెవెన్యూ శాఖలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ఢిల్లీలోని ప్రజలను కాలుష్య బెడద నుంచి కాపాడేందుకు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అన్ని రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం విధించనున్నారు.
ఢిల్లీలో కాలుష్యంపై కఠిన ప్రభుత్వం
దీపావళి సందర్భంగా పటాకుల కాల్చడం వల్ల విపరీతమైన కాలుష్యం పెరుగుతోంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తల్లెతుంది. ఇది కాకుండా.. రాజధాని వాతావరణం దాదాపు వారం రోజుల పాటు చాలా విషపూరితంగా మారుతుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గతేడాది ఢిల్లీలో క్రాకర్స్పై నిషేధం విధించారు. ఢిల్లీలో దీపావళి పటాకులపై ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి.
