శీలంపూర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అబ్దుల్ రహ్మాన్ బిజెపి అభ్యర్థి కౌశల్ కుమార్ మిశ్రాపై 27,887 ఓట్లు భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఊడ్చేసిన కేజ్రీవాల్...బిజెపికి మరోసారి భంగపాటు

ఢిల్లీలోని మొత్తం 70 శాసనసభ స్థానాలకు గత శనివారం పోలింగ్ జరగ్గా ఇవాళ(మంగళవారం) ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మరోసారి ఆప్ డిల్లీని ఊడ్చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సత్తా ఏమిటో మరోసారి బిజెపికి రుచిచూపించారు. ఇప్పటివరకు వెలువగడిన ఫలితాల ప్రకారం ఆప్ 63 స్థానాల్లో, బిజెపి 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కు మరోసారి ఖాళీ చేతులే మిగిలాయి.
శీలంపూర్ లో 27,887 ఓట్ల మెజారిటీతో ఆప్ అభ్యర్థి విజయం
ఇది నా విజయం కాదు... మీ ఇంటి బిడ్డ విజయం..: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీపై నమ్మకంతో మూడోసారి కూడా ఇంత గొప్ప విజయాన్ని అందిచిన డిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పేర్కోన్నారు. ఫలితాల అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తమ ఇంట్లో బిడ్డలాగ భావించి తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం ఇదని.. మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఇలాగే నిలబెట్టుకుంటానని కేజ్రీవాల్ అన్నారు.
''మన్ కి బాత్'' కంటే ''జన్ కీ బాత్'' కీలకం...: డిల్లీ ఫలితంపై ఉద్దవ్ ఠాక్రే
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ తో పాటే ఢిల్లీ ప్రజలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బిజెపిపై మరీ ముఖ్యంగా ప్రధాని మోదీపై సెటైర్లు విసిరారు. '' దేశం జన్ కి బాత్ (ప్రజల మాటల)తో నడుస్తుంది కానీ మన్ కి బాత్( ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమం) తో కాదు'' అని ఎద్దేవా చేశారు. బిజెపి కేజ్రీవాల్ ను టెర్రరిస్ట్ అన్నా ఆ మాటలను ప్రజలు నమ్మలేరని.. అందువల్లే ఇంతగొప్ప విజయాన్ని అందించారని ఉద్దవ్ పేర్కోన్నారు.
రాజేంద్ర నగర్ లో ఆప్ ఘనవిజయం... 20వేల మెజారిటీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజేందర్ నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించిది. ఆ పార్టీ అభ్యర్థి రాఘవ్ చందా 20,058 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్దే అతన్న భుజాలపై ఎత్తుకుని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... అరవింద్ కేజ్రీవాల్ దేశ ద్రోహి కాదు నిజమైన దేశభక్తుడని నమ్మారు కాబట్టే మరోసారి అతడికి పట్టం కట్టారని అన్నారు. బిజెపి చేసేది కాదు కేజ్రీవాల్ చేసేది అసలైన దేశభక్తి.
ఉత్కంఠకు తెర... ఢిల్లీ డిప్యూటీ సీఎందే విజయం
ఉత్కంఠ పోరులో చివరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విజేతగా నిలిచారు. మొదటి నుండి బిజెపి అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి గట్టి పోటీ ఇచ్చారు. ఓ దశలో అయితే వరుస రౌండ్లలో సిసోడియా వెనుకబడ్డారు. అయితే చివర్లో పుంజుకున్న ఆయన 3400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
వరుసగా ఐదో రాష్ట్రం... ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం: బిజెపి అభ్యర్థి
'' అద్భుత విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు అరవింద్ కేజ్రీవాల్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.ఈ ఓటమితో బిజెపి వరుసగా ఐదో రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. అంటే మేం ప్రజలకు దగ్గరవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం.'' అని మోడల్ టౌన్ బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా అభిప్రాయపడ్డాడు.
భార్యతో కలిసి కేజ్రీవాల్ సంబరాలు...ఆప్ గెలుపొక్కటే కాదు...
డిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అర్హత సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బంపర్ మెజారిటీ సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోడానికి సిద్దంగా వున్నారు. ఈ క్రమంలో భార్య సునీతతో కలిసి పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే అవి కేవలం గెలుపు సంబరాలు మాత్రమే కాదు... ఇవాళ కేజ్రీవాల్ భార్య పుట్టినరోజు. దీంతో ఆమెతో కేక్ కట్ చేయించి రెండు వేడుకలను ఒకేసారి జరుపుకున్నారు కేజ్రీవాల్.
స్వల్ప ఆధిక్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. పట్పార్ గంజ్ నుండి పోటీచేస్తున్న ఆయనకు బిజెపి అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వెనుకంజలో వున్న సిసోడియా తాజాగా 656 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
నా ఓటమికి కారణమదే: అల్కా లంబా
ఈ ఎన్నికల ఫలితం తనకు వ్యతిరేకంగా రావడానికి హిందూ-ముస్లీం ఓట్లు కేంద్రీకృతం అవ్వడమే కారణమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా. ఈ రెండు వర్గాలు పూర్తిగా కేవలం రెండు పార్టీలవైపే నిలిచారు. దీంతో తన ఓటమి తప్పలేదని... అయితే ఈ ఓటమిని తాను అంగీకరిస్తున్నానని అన్నారు.
ఆప్ విజయానికి కారణం అదికాకపోవచ్చు...ఇదే ఉదాహరణ: బిజెపి ఎంపీ
ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాలను ఆమోదిస్తున్నామని బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ తెలిపారు. ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే ఈ ఎన్నికల పలితానికి విద్య మరియు అభివృద్దే కారణమైతే విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఓటమిఅంచుల్లో నిలవడం ఏమిటని ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం... బంపర్ మెజారిటీతో
న్యూడిల్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన సీఎం కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 13,508 ఓట్ల ఆధిక్యంతో బిజెపి అభ్యర్ధి సునీల్ కుమార్ యాదవ్ పై విజయాన్ని అందుకున్నారు.
అమిత్ షా కు కరెంట్ షాక్...: ఆఫ్ అభ్యర్ధి అమానతుల్లా ఖాన్
ఓక్లా(షహీన్ బాగ్) నియోజకవర్గంలో రికార్డు విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ బిజెపిని విమర్శలు ఎక్కుపెట్టాడు. ఢిల్లీ ప్రజలు బిజెపికి, అమిత్ షాకి కరెంట్ షాక్ లాంటి ఫలితాన్ని ఇచ్చారు. ఇది అలసత్వంపై అభివృద్ది సాధించిన విజయమని అన్నారు. ఈ రికార్డు విజయం నాది కాదు ఢిల్లీ ప్రజలదేనని అమానతుల్లాఖాన్ పేర్కొన్నాడు.
అభినందనలు... ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ నే నమ్మారు.. : ఎంపీ గంభీర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు. విజయం దిశగా సాగుతున్న ఆప్ కు, సీఎం కేజ్రీవాల్ కు, ఢిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి శక్తివంన లేకుండా ప్రతిఒక్క బిజెపి నాయకుడు, కార్యకర్త కష్టపడ్డారు. అయితే ప్రజలకు తమపై నమ్మకాన్ని కలిగించలేకపోయాం. అరవింద్ కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీ మరింత అభివృద్ది చెందుతుందని అనుకుంటున్నట్లు గంభీర్ అభిప్రాయపడ్డారు.
కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకున్న ఆప్ పార్టీకి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పొలిటికల్ స్ట్రాటేజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభినందనలు తెలిపారు. ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ ను స్వయంగా కలిసి ఆ అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ ఓటమిని ముందే ఊహించాం...: ఎంపీ సీఎం కమల్ నాథ్
డిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా ఘోర ఓటమిని చవిచూస్తుందని ముందే ఊహించాం. అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బిజెపి పరిస్థితి ఇంత ఘోరంగా ఓటమిపాలవడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యిందన్నారు.
కల్కజిలో హోరాహోరీ...25 ఓట్లతో బిజెపి లీడ్
కల్కజి నియోజకవర్గంలో బిజెపి-ఆప్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 10వ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ధరమ్ వీర్ సింగ్ ఆప్ అభ్యర్థి ఆతిషిపై కేవలం 25 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. ధరమ్ వీర్ కు 20266 ఓట్లురాగా ఆతిషికి 20241 ఓట్లు వచ్చాయి.
ఘోర పరాజయానికి బాధ్యత నాదే: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు.
ఘోర పరాజయానికి బాధ్యత నాదే: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు.
ఘోర పరాజయానికి బాధ్యత నాదే: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు.
షహీన్ బాగ్ లో బిజెపి ముందంజ
ఓక్లా(షహీన్ బాగ్) నియోజవర్గంలో ఆప్-బిజెపిల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అయితే 8వ రౌండ్ ముగిసే సమయానికి బిజెపి అభ్యర్థి మొత్తం 7107 ఓట్లు సాధించగా ఆప్ అభ్యర్ధికి 5,474 ఓట్లు వచ్చాయి. ఇలా ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ పై బిజెపి అభ్యర్థి బ్రహమ్ సింగ్ 1633 ఓట్ల ఆధిక్యంలో నిలిచాడు.