ఢిల్లీలో లేడీ డాక్టర్ హత్య: ఆ తర్వాత ఇద్దరు వైద్యుల అదృశ్యం
పాతికేళ్ల మహిళా వైద్యురాలిని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపారు. ఆ తర్వాత అదే ఫ్లాట్ లో ఉండే ఇద్దరు వైద్యులు అదృశ్యమయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. పాతికేళ్ల మహిళా వైద్యురాలిని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపారు. ఆ తర్వాత అదే ఫ్లాట్ లో ఉండే ఇద్దరు వైద్యులు అదృశ్యమయ్యారు.
ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని రంజీత్ నగర్ లో చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత గరిమా మిశ్రా ఎండీ కోసం సిద్ధమవుతోంది. అదృశ్యమైన ఇద్దరు వైద్యులు కూడా ఉన్నత చదువుల కోసం తయారవుతున్నారు.