అబూ సలేంకు ఏడేళ్ల జైలు
అబూ సలేంకు ఏడేళ్ల జైలు..
బెదిరింపుల కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. తాను కోరినంత మొత్తం ఇవ్వని పక్షంలో కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో అబూపై 2002లో ఐపీసీ సెక్షన్ 387, సెక్షన్ 506 కింద బలవంతపు వసూళ్ల కేసు నమోదైంది. కాగా, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అబూ సలేంను ఇప్పటికే న్యాయస్థానం దోషిగా తేల్చింది.