Asianet News TeluguAsianet News Telugu

ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారం

రైలులో ఖైదీ బాత్రూమ్ వెళ్లింది. ఆమె వెంట ఇద్దరు మహిళా సిబ్బంది కూడా వెళ్లారు. అయితే ఖైదీ వాష్ రూమ్ లోకి వెళ్లగానే... కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి... ఆ ఇద్దరు మహిళా పోలీసులను వెనక్కి పంపించేశాడు. అనంతరం అతను బాత్రూమ్ లోకి వెళ్లి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించడం గమనార్హం.

Delhi Cop Offers to Stand Guard as Tihar Inmate Uses Train Toilet, Then Barges in and Rapes Her
Author
Hyderabad, First Published Aug 8, 2019, 8:54 AM IST

విచారణకు హాజరై తిరిగి వస్తున్న ఖైదీపై ఓ కానిస్టేబుల్ అత్యాచారం చేసిన దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరగగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వళితే... తీహాడ్ జైలులో ఖైదీగా ఉన్న  42ఏళ్ల మహిళ పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో కోర్టుకి హాజరై తిరిగి ఢిల్లీ కి రైలులో బయలుదేరింది. ఆ సమయంలో ఖైదీతోపాటు ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ క్రమంలో రైలులో ఖైదీ బాత్రూమ్ వెళ్లింది. ఆమె వెంట ఇద్దరు మహిళా సిబ్బంది కూడా వెళ్లారు. 

అయితే ఖైదీ వాష్ రూమ్ లోకి వెళ్లగానే... కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి... ఆ ఇద్దరు మహిళా పోలీసులను వెనక్కి పంపించేశాడు. అనంతరం అతను బాత్రూమ్ లోకి వెళ్లి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించడం గమనార్హం.

తర్వాత ఆమె తీహాడ్‌ జైలుకు వెళ్లి ఈ విషయాన్ని అక్కడి వైద్యులకు, సూపరింటెండెంట్‌కు వివరించింది. దీంతో హరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఖైదీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios