'దేశ భద్రత విషయంలో అసలు రాజీపడం'
భారత్ తన పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటోందని, అయితే అది జాతీయ భద్రతను పణంగా పెట్టడం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
భారత్ తన పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటోందని, కానీ.. దేశ భద్రతను పణంగా పెట్టాలని భావించడం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేరళలోని శివగిరి మఠంలో శుక్రవారం నాడు జరిగిన 90వ వార్షిక తీర్థయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. " మనం.. స్నేహితులను మార్చగలము కానీ పొరుగువారిని మార్చలేం" అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన వ్యాఖ్యను సింగ్ గుర్తు చేసుకున్నారు.
'జాతీయ భద్రతలో రాజీపడం'
రక్షణ మంత్రి మాట్లాడుతూ.. మన పొరుగువారితో మంచి, స్నేహపూర్వక సంబంధాలు అవసరం. కానీ, సత్సంబంధాలను కొనసాగించేందుకు దేశ భద్రత విషయంలో రాజీపడబోము. మన దేశ భద్రతను పణంగా పెట్టి ఎవరితోనూ సత్సంబంధాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో సాయుధ దళాల సహాయంతో భారతదేశ సరిహద్దులను రక్షించడానికి తాము కృషి చేస్తున్నామనీ, అలాగే.. మఠంలోని సాధువులు దేశ 'ఆత్మ'ను రక్షించడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మీరు చేస్తున్న పనిని నేను అభినందిస్తున్నాను. శరీరం, ఆత్మ రెండూ సురక్షితంగా ఉన్నప్పుడే మనం దేశంగా మనుగడ సాగించగలమని అన్నారు.
దేశం ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతుందని, మన మిలిటరీని లెక్కించదగిన శక్తిగా చూస్తుందని ఆయన అన్నారు. భారతదేశ సంస్కృతిలో స్వావలంబన అంతర్భాగమని, శ్రీ నారాయణ గురు ఈ సందేశాన్ని తన బోధనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని, శివగిరి మఠం కూడా దీనిని నిరంతరం ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని సింగ్ అన్నారు.
హీరాబెన్కు నివాళులు
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతికి సంతాపం తెలిపారు రక్షణ మంత్రి. తాను ఢిల్లీకి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నానని, అయితే తిరిగి వచ్చే ముందు అందరూ తమ అధికారిక కట్టుబాట్లను నెరవేర్చాలని ప్రధాని అందరికీ చెప్పారని మంత్రి చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరపున, శివగిరి మఠం తరపున,తాను మ హీరాబెన్కు నివాళులు అర్పిస్తున్నానని ఆయన అన్నారు. అనంతరం అక్కడ ఉన్న వారంతా ఒక్క నిమిషం మౌనం పాటించారు.
అంతకుముందు.. తన ప్రసంగంలో, స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం భారతీయ సంప్రదాయం, సిద్ధాంతాలలో భాగం కాదని, ఫ్రెంచ్ విప్లవం ద్వారా అది మనకు చేరిందని చాలా మంది ఆరోపించారు. కానీ ఆ వాదన సరికాదని అన్నారు. భారతీయ సంస్కృతిలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతికి మూలాలు కనిపిస్తాయనీ, వాస్తవానికి.. మానవ సమానత్వం భావన మన ప్రాచీన గ్రంథాలు, సాధువులు, తత్వవేత్తలు,వారి బోధన, సాహిత్య రచనలలో చూడవచ్చని అన్నారు.
కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్
భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ గురువారం చెప్పిందని, అయితే కాశ్మీర్తో సహా పెండింగ్లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కేంద్రప్రభుత్వం సీరియస్గా ఉందని తెలిపాలి. పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "పాకిస్తాన్ శాంతి, చర్చల పట్ల ఆసక్తి కలిగి ఉంది, సంబంధాలను మెరుగుపరచడంలో బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం భారత అధికారులపై ఉంది." అని పేర్కొన్నారు.