గేదెకు దశదిన కర్మ.. గ్రామస్తులకు భోజనాలు.. ఓ జంతు ప్రేమికుడి నివాళి..
గేదెకు దశదినకర్మ చేశాడో జంతు ప్రేమికుడు. తన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గేదె అనారోగ్యంతో మృతి చెందడంతో దానికి మనుషులకు చేసినట్టు అంత్యక్రియలు చేసి ఆ తరువాత దశదినఖర్మ కూడా చేసి తన ప్రేమను చాటుకున్నాడు. యూపీలోని మీరట్ లో జరిగిన ఈ ఘటనకు చెందిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
గేదెకు దశదినకర్మ చేశాడో జంతు ప్రేమికుడు. తన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గేదె అనారోగ్యంతో మృతి చెందడంతో దానికి మనుషులకు చేసినట్టు అంత్యక్రియలు చేసి ఆ తరువాత దశదినఖర్మ కూడా చేసి తన ప్రేమను చాటుకున్నాడు. యూపీలోని మీరట్ లో జరిగిన ఈ ఘటనకు చెందిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఆ వీడియోలో ఒక గేదెకు దశదిన కర్మలు చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని చనిపోయిన గేదెకు నివాళులు అర్పించారు. ఈ ఉదంతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని మొహమ్మద్ షాకిస్త్ గ్రామానికి చెందిన సుభాష్ వ్యవసాయం చేస్తుంటాడు. గత 32 ఏళ్లుగా ఒక గేదెను కూడా సంరక్షిస్తున్నాడు. ఈ మధ్య కొంతకాలంగా ఆ గేదె పాలు ఇవ్వడం మానేసింది. సుభాష్కు ఆ గేదెతో ప్రత్యేక అనుబంధం ఉంది. అది అనారోగ్యం బారిన పడినప్పుడు ఎంతో ఖర్చు చేసి వైద్యం చేయించాడు. అయినప్పటికీ ఆ గేదెను కాపాడుకోలేకపోయాడు.
ఆ గేదె మృతి చెందడంతో సుభాష్ కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడ్డారు. ఆ గేదెకు శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆది మృతి చెందిన పదవ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు గ్రామస్తులందరికీ అన్న సంతర్పణ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేదె శ్రద్ధాంజలి సభకు గ్రామస్తులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ఆ గేదె తమ ఇంటిలో సభ్యురాలిగా మెలిగిందని, దాని ఆత్మశాంతి కోసం సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించామన్నారు.