Asianet News TeluguAsianet News Telugu

కూతురి లవర్‌పై కారంపొడి.. కొడుకులతో దాడి.. చివరకు ఏమైందంటే?

మహారాష్ట్రలోని పూణెలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ను కలవడానికి రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంటికి బయల్దేరాడు. కానీ, ఆమె తల్లి, ఇద్దరు సోదరులు ఈ విషయం తెలుసుకుని మాటు వేసి రెడీగా ఉన్నారు. ఇంటికి రాకముందే ఆ వ్యక్తిపై కారం పొడి చల్లి దాడి చేశారు.
 

daughters lover beaten by mother and both brothers after throwing chilli powder at his residency
Author
First Published Sep 16, 2022, 6:45 PM IST

పూణె: మహారాష్ట్రలో ఓ మహిళ.. కూతురిని కలవడానికి వచ్చిన వ్యక్తిపై దాడికి దిగింది. తన కూతురి లవర్ పై కారం పొడి చల్లింది. ఇది అదనుగా తీసుకుని ఆమె కొడుకులు ఇద్దరు ఆ వ్యక్తి పై దాడి చేశారు. రాడ్లతో తల పై గట్టిగా బాదారు. చివరకు ఆ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తల పై తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తున్నది. ఈ ఘటన  మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో
పూణెలో చించ్వాడ్‌లోని పోష్ సొసైటీ చోటుచేసుకుంది.

విశాల్ కాస్బే అనే యువకుడికి ఓ అమ్మాయితో పరిచయం ఉన్నది. ఆ అమ్మాయి, అబ్బాయి విశాల్ కాస్బే ప్రేమించుకుంటున్నారు.
మంగళవారం రాత్రి ప్రేయసిని కలవడానికి విశాల్ కాస్బే ఆమె ఇంటికి బయల్దేరాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తల్లి, ఆ అమ్మాయి సోదరులు గమనించారు.

విశాల్ కాస్బే అమ్మాయిని కలవడానికి ముందే ఆమె తల్లి, ఇద్దరు మైనర్ సోదరులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. విశాల్ కాస్బేను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చిన్నపాటి వాగ్వాదం జరిగింది.

దీంతో ఆ మైనర్ల తల్లి కారం పొడి తెచ్చి విశాల్ కాస్బేపై చల్లింది. దీంతో విశాల్ కాస్బే నిస్సహాయుడిగా మారాడు. ఈ సమయాన్ని అదునుగా తీసుకుని విశాల్ కాస్బే ప్రేయసి సోదరులు ఆయన పై దాడికి దిగారు. రాడ్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారు స్పాట్ నుంచి పారిపోయారు.

ఆ సొసైటీకి చెందిన కొందరు బాధితుడు విశాల్ కాస్బేను సమీప హాస్పిటల్‌లో చేర్చారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స అందుతున్నది. ఆయన తలపై ఎక్కువ గాయాలు అయినట్టు తెలుస్తున్నది.

పూణె పోలీసులకు ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసుకుని సదరు మహిళను అరెస్టు చేశారు. ఆమె ప్రస్తుతం జైలులో ఉన్నది. కాగా, ఆమె ఇద్దరు మైనర్ కుమారులను జువెనైల్ కరెక్షన్ హోమ్‌కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios