Asianet News TeluguAsianet News Telugu

దేశంలో పేలుళ్లకు హైద్రాబాద్ కేంద్రంగా కుట్ర: ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు హైద్రాబాద్ లో  అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది. హైద్రాబాద్ నగరంలోని నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు  పాకిస్తాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇద్దరు ఉగ్రవాదులను రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కీలక విషయాలను పొందుపర్చింది.

Darbhanga blast: NIA found key information from two LeT operatives from Hyderabad lns
Author
New Delhi, First Published Jul 1, 2021, 11:25 AM IST

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు హైద్రాబాద్ లో  అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది. హైద్రాబాద్ నగరంలోని నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు  పాకిస్తాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇద్దరు ఉగ్రవాదులను రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కీలక విషయాలను పొందుపర్చింది.

హైద్రాబాద్ నగరంలో రెడీమెడ్ బట్టల వ్యాపారం చేస్తున్నారు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లు .  2012లో నాసిర్ మాలిక్  పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. పాకిస్తాన్ లో  ఉగ్రవాది ఇక్బాల్ తో నాసిర్  మాలిక్ కు  సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి ఆయన వారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు.

యూపీకి చెందిన మరో ఇద్దరితో కలిసి పేలుడు పదార్ధాల తయారీలో కూడ నాసిర్ మాలిక్ శిక్షణ పొందినట్టుగా ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పాకిస్తాన్ కు చెందిన  ఇక్బాల్ ఆదేశాల మేరకు దేశంలో భారీ పేలుళ్లకు హైద్రాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులు ప్లాన్ చేశారు.పేలుడుకు సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ వాడినట్టుగా నిందితులు ఈ విచారణలో వెల్లడించారు. రసాయనాల బాంబులను పార్శిల్ లో  దుస్తులమధ్యలో ఉంచి పార్శిల్ ను పంపారు. 16 గంటలలోపుగా ఈ బాంబు పేలేలా ప్లాన్ చేశారనీ ఈ రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు.

also read:దర్బాంగా రైల్వేస్టేషన్ పేలుడు ఘటన: మూడో వ్యక్తి ప్రమేయంపై హైద్రాబాద్‌లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్

16 గంటల పాటు నడిచే రైలులో పేలుడు పదార్ధాలను పేల్చడం ద్వారా  భారీగా ప్రాణ, ఆస్తినష్టం  చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ రసాయనం  బట్టల మధ్యలో కారిపోయింది. పేలుడు సంబవించే సమయానికి ఆ సీసాలో తక్కువ మోతాదులో రసాయనం ఉంది.  దీంతో  పేలుడు తీవ్రత తగ్గిందని అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడ ఈ పేలుడు ఘటనతో సంబంధం ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. సుఫియాన్ అర్షద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పేలుడు చోటు చేసుకొన్న సమయంలో అర్షద్ దర్భాంగా రైల్వేస్టేషన్ లో ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios