జమ్మూలో షాకింగ్ ఘటన.. రెండు ఇళ్లలో 6 మృతదేహాలు లభ్యం.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
Crime News: జమ్మూకాశ్మీర్ లోని రెండు ఇండ్లలో ఆరు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. బలవంతంగా విషప్రయోగం చేశారా లేక మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండు ఇండ్లలో ఆరు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. బలవంతంగా విషప్రయోగం చేశారా లేక మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఒక విషాద సంఘటనగురించి పోలీసులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.. జమ్మూ నగర శివార్లలోని సిధ్రాలోని తావి విహార్ ప్రాంతంలో ఉన్న రెండు ఇళ్లలో ఆరు మృతదేహాలు అభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బుధవారం ఉదయం ఈ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంలో పోలీసు శాఖ ఇప్పటివరకు స్పష్టంగా ఎలాంటి వివరాలను చెప్పలేకపోతోంది. అయితే, బలవంతంగా విషప్రయోగం చేశారా లేక మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
మృతదేహాలను జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. నిజానిజాలను వెలికి తీసేందుకు రూరల్ ఎస్పీ సంజయ్ శర్మ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఎస్డిపీవో నగ్రోటా ప్రదీప్ కుమార్, ఎస్హెచ్వో నగ్రోటా ఇన్స్పెక్టర్ విశ్వ ప్రతాప్, ఎస్ఐ మాజిద్ హుస్సేన్ లు ఉన్నారు. బర్జుల్లా శ్రీనగర్లోని 900 భట్ హౌస్లో నివాసం ఉంటున్న షెహజాదా కుమార్తె హబీబుల్లా భట్ అని ఒక మహిళ శ్రీనగర్ నుండి తమకు కాల్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తన సోదరుడు నూర్ ఉల్ హబీబ్కు చాలా కాలంగా ఫోన్ చేస్తున్నానని, అయితే వారు కాల్ ను స్వీకరించలేదని తెలిపారు. తన సోదరుడు సిధ్రాలోని తావి విహార్ లో నివసిస్తున్నాడని చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్హెచ్వో నగ్రోటా ఇన్స్పెక్టర్ విశ్వప్రతాప్, ఎస్ఐ సిద్ధ మజీద్ హుస్సేన్తో పాటు పోలీస్ స్టేషన్ నగ్రోటా, పోలీస్ అవుట్పోస్ట్ సిద్ధ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. నిశితంగా పరిశీలిస్తే, వారు ఇంట్లో నుండి దుర్వాసన రావడం గమనించారు. తావి విహార్ కాలనీ సిధ్రా కు చెందిన స్థానిక ప్రజల సమక్షంలో పోలీసులు బలవంతంగా ఇంటి తలుపులు పగులగొట్టారు. ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు పడి ఉండటాన్ని చూసి పోలీసులు షాక్కు గురయ్యారు. దీనిపై ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని, పీసీఆర్లోని క్రైమ్ విభాగానికి చెందిన ఫోటోగ్రాఫర్లను అక్కడికి పిలిపించారు. సంఘటనా స్థలం నుంచి ఆధారాలు, ఇతర నమూనాలను సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రాథమిక విచారణలో విషప్రయోగం జరిగి ఉండొచ్చని పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని బలవంతంగా ఇచ్చారా ? అనే విషయం తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలంలో లభించిన నాలుగు మృతదేహాలలో మొదటి మృతదేహం నూర్ ఉల్ హబీబ్ కుమారుడు హబీబుల్లా, సకీనా బేగం భార్య దివంగత గులాం హసన్, ఆమె కుమార్తె నస్సేమా అక్తర్ కుమార్తె లేట్ గులామ్ హసన్, సజ్జాద్ అహ్మద్ కుమారుడు ఫరూక్ అహ్మద్ మాగ్రేలు ఉన్నారు. పోలీసులు ఇరుగుపొరుగు వారితో మాట్లాడగా.. సకీనా బేగం ఇల్లు మరొకటి అని తెలిసింది. పోలీసు బృందం విచారణ కోసం అక్కడికి చేరుకోగా, అక్కడ కూడా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలు సకీనా బేగం కుమారుడు జాఫర్ సలీమ్, కుమార్తె రుబీనా బానోలుగా గుర్తించారు. వేర్వేరు ఇళ్లలో దొరికిన ఈ ఆరు మృతదేహాలు పోలీసులను అయోమయంలో పడేశాయి. పోలీసులు ఇంకా ఈ ఘటనపై స్పష్టంగా ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఎస్పీ జమ్మూ చందన్ కోహ్లి.. ఏమీ చెప్పలేమని చెప్పారు. పోస్ట్మార్టం రిపోర్టు, విచారణ ఆధారంగానే ఇది ఆత్మహత్యా లేక హత్యా అనేది తేలనుందని వెల్లడించారు.