కంజావాలా రోడ్డు ప్రమాదం కేసు.. నిందితుడు అశుతోష్కు షాకిచ్చిన కోర్టు
కంజావాలా ఘటనలో నిందితుడు అశుతోష్ భరద్వాజ్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. డిసెంబర్ 31 అర్థరాత్రి కంఝవాలాలో ఓ మహిళ స్కూటీని ఢీకొట్టడంతో ఆమెను కారు చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో చనిపోయింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ కంజావాలారోడ్డు ప్రమాదంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశుతోష్ భరద్వాజ్కి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నిందితుడి బెయిల్ పిటిషన్ను రోహిణి కోర్టు తీరస్కరించింది. కేసు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ప్రతి నిందితుడి పాత్రను విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాస్రిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకురాగా.. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్యా దలాల్ బెయిల్ను తిరస్కరించారు.
నిందితులు విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారనీ, నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు మొగ్గు చూపడం లేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్యా దలాల్ తెలిపారు.
సహ నిందితుడు దీపక్ కారు నడుపుతున్నాడని చెప్పి విచారణను పక్కదారి పట్టించేందుకు భరద్వాజ్ ప్రయత్నించారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ ఆరోపించారు. యువతి యాక్సిడెంట్ కేసును ప్రత్యేకంగా కోర్టు విచారిస్తున్నది. అయితే, ఘ టన సమయంలో నిందితుడు కారులో లేడని అశుతోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
సహ నిందితుడు దీపక్ ఖన్నా కారు నడుపుతున్నాడా?
ప్రాసిక్యూషన్ ప్రకారం.. సహ నిందితుడు దీపక్ ఖన్నా కారు నడుపుతున్నాడని భరద్వాజ్ తప్పుగా చెప్పాడని, విచారణలో మరో నిందితుడు అమిత్ వాహనం నడుపుతున్నాడని తేలింది. భరద్వాజ్ ప్రవర్తన గురించి ప్రశ్నలను లేవనెత్తిన శ్రీవాస్తవ, నిందితుడు పోలీసులకు తెలియజేయడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నాడని, బదులుగా ప్రాసిక్యూషన్ను తప్పుదారి పట్టించాడని అన్నారు. నిందితుడు భరద్వాజ్ ఇతర నిందితులతో కుమ్మక్కయ్యాడని దీన్నిబట్టి తెలుస్తోంది. భరద్వాజ్ కారులో ఉన్నాడని ఎప్పుడూ మా పక్షం కాదని, డ్రైవింగ్ లైసెన్స్ లేని మరో సహ నిందితుడికి ప్రమాదానికి గురైన వాహనాన్ని ఆయనే ఇచ్చారని ప్రాసిక్యూటర్ తెలిపారు.
భరద్వాజ్ తరపు న్యాయవాది శిల్పేష్ చౌదరి వాదిస్తూ, ఘటన జరిగిన సమయంలో ఆయన కారులో లేరని, ఆరోపించిన నేరాలన్నీ సహజంగానే బెయిలబుల్గా ఉన్నాయని వాదించారు. ఆరోపించిన సంఘటన తర్వాత భరద్వాజ్ పోలీసులకు సహకరించారని, మరో ఇద్దరు సహ నిందితులను అరెస్టు చేయడంలో వారికి సహకరించారని ఆయన చెప్పారు. ఈ కేసులో జనవరి 2న పోలీసులు దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), కృష్ణ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్లను అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం అశుతోష్ని అరెస్టు చేశారు. నిందితులందరినీ సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.